Political News

బీజేపీతో టీడీపీ కలిస్తే గెలిచేది వైసీపీయేనట

వరుస సభలు, పోటెత్తుతున్న ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే, ఆ ఉత్సాహాన్ని చల్లార్చేలా తాజాగా ఓ సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది.. జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.. జనసేన, బీజేపీలు రెండింటినీ కలుపుకొని వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఆ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాలు ఎంతవరకు కరెక్టు అనేది పక్కనపెడితే సర్వే లేవనెత్తిన కొన్ని కీలక అంశాలను మాత్రం టీడీపీ అర్థం చేసుకుంటే మంచిదనే భావన వ్యక్తమవుతుంది.

ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదని.. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మొత్తం ముగ్గురికీ కలిపి 60 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. అలా కాకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 100 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వే. మరోవైపు 41 నియోజకవర్గాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సర్వే తెలిపింది.

కేంద్రంలోని బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని.. ఆ వ్యతిరేకత ప్రభావం ఆ పార్టీతో కలిస్తే టీడీపీపైనా పడుతుందని ఆత్మసాక్షి సర్వే అభిప్రాయపడింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో నష్టం కలగుతుందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో బీజేపీతో కలిస్తే టీడీపీకి నష్టమేనని తేల్చింది ఈ సర్వే. అయితే… ఈ సర్వే 41 స్థానాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాలని సూచించిన నేపథ్యంలో పార్టీ దీన్ని రివ్యూ చేసుకుంటే బాగుండొచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు.

This post was last modified on January 17, 2023 9:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

13 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago