Political News

బీజేపీతో టీడీపీ కలిస్తే గెలిచేది వైసీపీయేనట

వరుస సభలు, పోటెత్తుతున్న ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే, ఆ ఉత్సాహాన్ని చల్లార్చేలా తాజాగా ఓ సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది.. జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.. జనసేన, బీజేపీలు రెండింటినీ కలుపుకొని వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఆ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాలు ఎంతవరకు కరెక్టు అనేది పక్కనపెడితే సర్వే లేవనెత్తిన కొన్ని కీలక అంశాలను మాత్రం టీడీపీ అర్థం చేసుకుంటే మంచిదనే భావన వ్యక్తమవుతుంది.

ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదని.. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మొత్తం ముగ్గురికీ కలిపి 60 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. అలా కాకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 100 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వే. మరోవైపు 41 నియోజకవర్గాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సర్వే తెలిపింది.

కేంద్రంలోని బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని.. ఆ వ్యతిరేకత ప్రభావం ఆ పార్టీతో కలిస్తే టీడీపీపైనా పడుతుందని ఆత్మసాక్షి సర్వే అభిప్రాయపడింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో నష్టం కలగుతుందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో బీజేపీతో కలిస్తే టీడీపీకి నష్టమేనని తేల్చింది ఈ సర్వే. అయితే… ఈ సర్వే 41 స్థానాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాలని సూచించిన నేపథ్యంలో పార్టీ దీన్ని రివ్యూ చేసుకుంటే బాగుండొచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు.

This post was last modified on January 17, 2023 9:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

7 minutes ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

29 minutes ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

1 hour ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

2 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

2 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

3 hours ago