Political News

బీజేపీతో టీడీపీ కలిస్తే గెలిచేది వైసీపీయేనట

వరుస సభలు, పోటెత్తుతున్న ప్రజలు తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే, ఆ ఉత్సాహాన్ని చల్లార్చేలా తాజాగా ఓ సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది.. జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది.. జనసేన, బీజేపీలు రెండింటినీ కలుపుకొని వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఆ సర్వే అంచనా వేసింది. ఈ అంచనాలు ఎంతవరకు కరెక్టు అనేది పక్కనపెడితే సర్వే లేవనెత్తిన కొన్ని కీలక అంశాలను మాత్రం టీడీపీ అర్థం చేసుకుంటే మంచిదనే భావన వ్యక్తమవుతుంది.

ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి నష్టమే తప్ప లాభం లేదని.. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మొత్తం ముగ్గురికీ కలిపి 60 నుంచి 75 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. అలా కాకుండా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 100 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వే. మరోవైపు 41 నియోజకవర్గాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సర్వే తెలిపింది.

కేంద్రంలోని బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని.. ఆ వ్యతిరేకత ప్రభావం ఆ పార్టీతో కలిస్తే టీడీపీపైనా పడుతుందని ఆత్మసాక్షి సర్వే అభిప్రాయపడింది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో నష్టం కలగుతుందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో బీజేపీతో కలిస్తే టీడీపీకి నష్టమేనని తేల్చింది ఈ సర్వే. అయితే… ఈ సర్వే 41 స్థానాలలో టీడీపీ ఇంచార్జులను మార్చాలని సూచించిన నేపథ్యంలో పార్టీ దీన్ని రివ్యూ చేసుకుంటే బాగుండొచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు.

This post was last modified on January 17, 2023 9:12 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

27 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago