మాస్ మహారాజా రవితేజకు ఎంత ఎనర్జీ ఉన్నా వరసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఒక హిట్టు లేదా బ్లాక్ బస్టర్ పడటం ఆలస్యం ఫ్లాపులు క్యూ కట్టడం అలవాటుగా మారిపోయింది. గత మూడు నాలుగేళ్లలో ఇది మరీ అన్యాయంగా మారిపోయింది. క్రాక్ ఇచ్చిన ఆనందం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ నీరుగార్చేశాయి. అంతకు ముందు రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ అంటోనీ, డిస్కో రాజా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ లిస్టులో చేరాయి. దెబ్బకు రవితేజ మార్కెట్ ప్రభావితం చెందిన మాట వాస్తవం. ప్రతిసారి ఇదే తంతు రిపీట్ అవుతూనే వస్తోంది.
రవితేజ 2010 టైంలో వరసగా రెండు సూపర్ హిట్లు అందుకున్నాడు. డాన్ శీను ఘనవిజయం సాధించగా ఆ మరుసటి ఏడాది మిరపకాయ్ మరో సూపర్ సక్సెస్ ని అందించింది. అక్కడి నుంచి వరసగా రెండు కంటిన్యూ హిట్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు ఆ సీన్ రిపీట్ అయ్యింది. మొన్న డిసెంబర్ లో ధమాకా మాములు రచ్చ చేయలేదు. రొటీన్ గా ఉందనే కామెంట్స్ ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపి వంద కోట్ల గ్రాస్ ని ఈజీగా జేబులో వేసుకుంది. సంక్రాంతికి థియేటర్ల సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సరే ఇంకా కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ నమోదు చేస్తోంది.
వాల్తేరు వీరయ్య అంతకు మించి అనేలా దూసుకుపోవడంలో రవితేజ పాత్ర చాలా కీలకం. స్వయంగా చిరంజీవే మాస్ రాజా లేకపోతే దీనికి ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదని చెప్పినప్పుడు దీన్ని గెస్టుగానో క్యామియోగానో చూడలేం. చివరి అరగంట మినహాయించి చిరుతో పోటీగా రవితేజ పండించిన స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కి మాములుగా కనెక్ట్ అవ్వలేదు. మూడు రోజులకే 108 కోట్ల గ్రాస్ అంటే ఫైనల్ రన్ అయ్యేలోపు ఈజీగా రెండు వందల కోట్లకు దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడీ డబుల్ కిక్ రాబోయే రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వరరావులకు చాలా ప్లస్ అవుతుంది. ఇంకొక్క హిట్టు కొడితే హ్యాట్రిక్ కన్ఫర్మే.
This post was last modified on January 17, 2023 8:43 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…