మాస్ మహారాజా రవితేజకు ఎంత ఎనర్జీ ఉన్నా వరసగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఒక హిట్టు లేదా బ్లాక్ బస్టర్ పడటం ఆలస్యం ఫ్లాపులు క్యూ కట్టడం అలవాటుగా మారిపోయింది. గత మూడు నాలుగేళ్లలో ఇది మరీ అన్యాయంగా మారిపోయింది. క్రాక్ ఇచ్చిన ఆనందం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ నీరుగార్చేశాయి. అంతకు ముందు రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ అంటోనీ, డిస్కో రాజా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ లిస్టులో చేరాయి. దెబ్బకు రవితేజ మార్కెట్ ప్రభావితం చెందిన మాట వాస్తవం. ప్రతిసారి ఇదే తంతు రిపీట్ అవుతూనే వస్తోంది.
రవితేజ 2010 టైంలో వరసగా రెండు సూపర్ హిట్లు అందుకున్నాడు. డాన్ శీను ఘనవిజయం సాధించగా ఆ మరుసటి ఏడాది మిరపకాయ్ మరో సూపర్ సక్సెస్ ని అందించింది. అక్కడి నుంచి వరసగా రెండు కంటిన్యూ హిట్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు ఆ సీన్ రిపీట్ అయ్యింది. మొన్న డిసెంబర్ లో ధమాకా మాములు రచ్చ చేయలేదు. రొటీన్ గా ఉందనే కామెంట్స్ ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపి వంద కోట్ల గ్రాస్ ని ఈజీగా జేబులో వేసుకుంది. సంక్రాంతికి థియేటర్ల సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సరే ఇంకా కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ నమోదు చేస్తోంది.
వాల్తేరు వీరయ్య అంతకు మించి అనేలా దూసుకుపోవడంలో రవితేజ పాత్ర చాలా కీలకం. స్వయంగా చిరంజీవే మాస్ రాజా లేకపోతే దీనికి ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదని చెప్పినప్పుడు దీన్ని గెస్టుగానో క్యామియోగానో చూడలేం. చివరి అరగంట మినహాయించి చిరుతో పోటీగా రవితేజ పండించిన స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కి మాములుగా కనెక్ట్ అవ్వలేదు. మూడు రోజులకే 108 కోట్ల గ్రాస్ అంటే ఫైనల్ రన్ అయ్యేలోపు ఈజీగా రెండు వందల కోట్లకు దగ్గరగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడీ డబుల్ కిక్ రాబోయే రావణాసుర, ఈగల్, టైగర్ నాగేశ్వరరావులకు చాలా ప్లస్ అవుతుంది. ఇంకొక్క హిట్టు కొడితే హ్యాట్రిక్ కన్ఫర్మే.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…