కోన వెంకట్ పేరు తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ఫుల్ డైలాగులకు, కథలకు ఆయన పెట్టింది పేరు. అంతెందుకు తాజాగా వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా ఆయనే కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే.
అలాంటి కోన వెంకట్ ఇప్పుడు తన స్వస్థలం బాపట్లలో నిర్వహించిన ఓ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయమవుతోంది. వెంకట్ బాపట్లలో చిరంజీవి అభిమానులతో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించారు. పెద్దసంఖ్యలో చిరంజీవి అభిమానులు హాజరయ్యారు. ఇదంతా సాధారణంగా అనిపిస్తున్నా.. దీని వెనుక రాజకీయం ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి.. కోన వెంకట్కు బాబాయి అవుతారు. ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన కోన రఘుపతి జగన్ మంత్రివర్గంలో బెర్త్ ఆశించినా అవకాశం దొరకలేదు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి సరిపెట్టారు.
2024లో వైసీపీ అధికారంలోకి వస్తే రఘుపతికి మంత్రి పదవి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే, బాపట్లలో ఆయన విజయం సాధించడంపైనే అనుమానాలున్నాయి. అందుకు కారణం కాపుల ఓట్లు ఆ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉండడం.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీచేసే సూచనలున్నాయి. పైగా జనసేన ఈసారి కాపుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. గత ఎన్నికలలో కులాలకు దూరమని పవన్ చెప్పడంతో అప్పట్లో కాపులు, జనసేన లింకేజ్ అంతగా జరగలేదు. కానీ, ఈసారి పరిస్థితి వేరు.
కాబట్టి 2024లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి.. కాపులంతా జనసేనకు మద్దతుగా ఈ కూటమి అభ్యర్థికి ఓట్లేస్తే రఘుపతి విజయం కష్టమే. బ్రాహ్మణ వర్గానికి చెందిన రఘుపతి విజయంలో ఇంతవరకు కాపుల ఓట్లు కీలకంగా పనిచేశాయి. కానీ, వచ్చే ఎన్నికలలో వారి ఓట్లు పడకపోతే ఆయన ఓటమి తప్పదు.
ఆ ఆందోళనతోనే కాపుల ఓట్లకు రఘుపతి ప్రణాళిక రచించారని.. అందులో భాగంగానే సినీ కెనక్షన్ ఉన్న తన బంధువు కోన వెంకట్ను రంగంలోకి దించి మెగా అభిమానుల ఓట్లు ఆకర్షించే పనిని రఘుపతి ప్రారంభించారని టాక్. ఆ స్ట్రాటజీకి యాక్షన్ పార్టీగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…