కోన వెంకట్ పేరు తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ఫుల్ డైలాగులకు, కథలకు ఆయన పెట్టింది పేరు. అంతెందుకు తాజాగా వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా ఆయనే కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే.
అలాంటి కోన వెంకట్ ఇప్పుడు తన స్వస్థలం బాపట్లలో నిర్వహించిన ఓ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయమవుతోంది. వెంకట్ బాపట్లలో చిరంజీవి అభిమానులతో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించారు. పెద్దసంఖ్యలో చిరంజీవి అభిమానులు హాజరయ్యారు. ఇదంతా సాధారణంగా అనిపిస్తున్నా.. దీని వెనుక రాజకీయం ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
బాపట్ల ఎమ్మెల్యేగా ఉన్న కోన రఘుపతి.. కోన వెంకట్కు బాబాయి అవుతారు. ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన కోన రఘుపతి జగన్ మంత్రివర్గంలో బెర్త్ ఆశించినా అవకాశం దొరకలేదు. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి సరిపెట్టారు.
2024లో వైసీపీ అధికారంలోకి వస్తే రఘుపతికి మంత్రి పదవి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే, బాపట్లలో ఆయన విజయం సాధించడంపైనే అనుమానాలున్నాయి. అందుకు కారణం కాపుల ఓట్లు ఆ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉండడం.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీచేసే సూచనలున్నాయి. పైగా జనసేన ఈసారి కాపుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. గత ఎన్నికలలో కులాలకు దూరమని పవన్ చెప్పడంతో అప్పట్లో కాపులు, జనసేన లింకేజ్ అంతగా జరగలేదు. కానీ, ఈసారి పరిస్థితి వేరు.
కాబట్టి 2024లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి.. కాపులంతా జనసేనకు మద్దతుగా ఈ కూటమి అభ్యర్థికి ఓట్లేస్తే రఘుపతి విజయం కష్టమే. బ్రాహ్మణ వర్గానికి చెందిన రఘుపతి విజయంలో ఇంతవరకు కాపుల ఓట్లు కీలకంగా పనిచేశాయి. కానీ, వచ్చే ఎన్నికలలో వారి ఓట్లు పడకపోతే ఆయన ఓటమి తప్పదు.
ఆ ఆందోళనతోనే కాపుల ఓట్లకు రఘుపతి ప్రణాళిక రచించారని.. అందులో భాగంగానే సినీ కెనక్షన్ ఉన్న తన బంధువు కోన వెంకట్ను రంగంలోకి దించి మెగా అభిమానుల ఓట్లు ఆకర్షించే పనిని రఘుపతి ప్రారంభించారని టాక్. ఆ స్ట్రాటజీకి యాక్షన్ పార్టీగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.
This post was last modified on January 15, 2023 1:28 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…