ఈ నెల 27 నుంచి టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నా రు. సుమారు 4 వేల కిలొమీటర్ల దూరాన్ని ఆయన 4 వందల రోజుల్లో పూర్తి చేయాలని లెక్కలు వేసుకున్నా రు. తద్వారా పార్టీని బలోపేతం చేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ పనిమీదే ఆయన ఫిజియోథెరపిస్టులను కూడా సంప్రదిస్తున్నారు.
అయితే.. లోకేష్ పాదయాత్రను అనౌన్స్ చేయగానే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున అనూహ్యంగా స్పందించారు. పాదయాత్రను నిలిపివేస్తామని.. ఎలా తిరుగుతారని.. కామెంట్లు చేశారు. ఇవి మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి కౌంటర్గా.. టీడీపీ కూడా.. మేం ఆరోజు జగన్ పాదయాత్రను అనుమతించలేదా? మేం కూడా ఆపేసి ఉంటే ఏమయ్యేది? అని ప్రశ్నించారు.
ఇక, దీనిపై దృష్టి పెట్టిన జగన్..పాదయాత్రను ఆపుతామని కానీ.. ఆపాలని కానీ ఎవరూ ప్రయత్నించరా దంటూ… మౌఖిక ఆదేశాలు పంపించారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర చేసుకునేందు కు పోలీసులు కూడా సహకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు సమాచారం. నిజానికి పాదయాత్ర అంటే.. అత్యంత సెన్సిటివ్ విషయం. ప్రజల్లో దీనిపై సానుకూల దృక్ఫథం ఏర్పడుతుంది. ఫలితంగా వైసీపీకి నష్టం కలిగిస్తుంది.
ఇదీ.. వైసీపీ నాయకుల ఆలోచన. అందుకే ఆపేస్తామని అన్నారు. అయితే.. జగన్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారని అంటున్నారు. పాదయాత్రను ఆపడం వల్ల మరింత సెంటిమెంటు ను రాజేసేందుకు చంద్రబాబు ఆయన తనయుడు ప్రయత్నిస్తారు.. అనుకూల మీడియా మరింత యాగీ చేస్తుంది.. కాబట్టి పాదయాత్రకు అడ్డం చెప్పొద్దని చెప్పారట. అంతేకాదు.. పాదయాత్ర చేసినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదని..కొత్త ఫార్ములా చెప్పారట.
దీనికి సంబంధించి రెండు ఉదాహరణలు సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం. ఒకటి తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేసినా.. అనుకున్న మైలేజీ రాలేదని.. సో.. వారు మునుగోడులో ఓడి పోయారని కాబట్టి భయం అవసరం లేదని అన్నారట. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత.. రాహుల్ చేసిన పాదయాత్ర కూడా పార్టీలో ఎలాంటి జోష్ పెంచలేదని కాబట్టి పాదయాత్రలు ఇప్పుడు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని లోకేష్ను చేసుకోనివ్వాలని చెప్పారట.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…