తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో ఆయన చేసిన డైలాగులు.. పేల్చిన పంచ్లు జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంబరాల రాంబాబు డైలాగును వైసీపీ నాయకులు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆయా డైలాగులకు సంబంధించిన వీడియోలు ముక్కలు ముక్కలుగా టీడీపీ నేతలే వైరల్ చేస్తుండడం గమనార్హం.
ఈ వీడియోల్లో సీఎం జగన్ నుంచి మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, సలహాదారు రామకృష్నారెడ్డి వంటివారిపై పవన్ పేల్చిన పంచ్లు ఉన్నాయి. ఇవి యువత నోటిలో నానుతున్నాయి. ఇవి కనుక ప్రజల్లోకి వెళ్తే.. తమకు ఇబ్బంది తప్పదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కువగా మూడుముక్కల జగన్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.
అదే సమయంలో సంబరాల రాంబాబు కూడా వైరల్గా మారింది. ఇక, సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి.. డంకాపలాస్ అని వ్యాఖ్యానించారు. ఇది పెద్దగా వైరల్ కాకపోయినా.. ఇతర వ్యాఖ్యలు మాత్రం జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక, మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ రాణి అని వేసిన పంచ్ కూడా సీమ ప్రాంతంలో జోరుగా వైరల్ అవుతోంది. గుడివాడ నానిని ఉద్దేశించి పులి-మేక, గుడివాడ అమర్నాథ్ ,పేర్ని నానిలను ఉద్దేశించి వందిమాగధులు అంటూ..పవన్ పంచ్లే శారు.
ఇప్పుడు ఇవన్నీ.. కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్, రోజా, అంబటిపై పేల్చిన పంచ్లకు కౌంటర్ పంచ్లు వేయాలని.. పార్టీ అదిష్టానం నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. మరి మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…