దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్తో పోరాడుతోంది. ఇప్పుడు అందరి చూపు కరోనా వ్యాక్సిన్పైనే. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో భాగంగా అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ను భారత్ బయోటెక్ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్లోని నిమ్స్లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను వైద్యులు ప్రారంభించారు.
ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ను రూపొందించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ను ఆగస్టు15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులలో హ్యూమన్ ట్రయల్స్ను వేగవంతం చేయనున్నారు. హైదరాబాద్లో నిమ్స్లో ఈ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్` వ్యాక్సిన్పై మొదటి, రెండో క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అనుమతులు ఇచ్చి నిమ్స్లో ట్రయల్స్ మొదలుపెట్టిన ఐసీఎంఆర్ ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలని భావిస్తోంది.
మరోవైపు, ఇప్పటికే కొన్ని ప్రధాన ఆసుపత్రిలలో హ్యూమన్ ట్రయిల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు కూడా ఎథిక్స్ అనుమతి లభించింది. హ్యుమన్ ట్రయల్స్లో భాగంగా వాలంటరీ ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నామని, సంబంధిత వాలంటీర్ల ఆరోగ్య పరీక్షలను ప్రారంభించామనీ ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు.
This post was last modified on July 20, 2020 7:52 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…