రాజకీయాల్లో ఏ పరిస్థితిని అయినా..తనకు అనకూలంగా మార్చుకుని.. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఇప్పుడు ఏపీ వైసీపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. విభజన అంశాలపై, ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై దాదాపు 8 సంవత్సరాలుగా ఉలుకు.. పలుకు లేకుండా.. తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న కేసీఆర్ను న్యాయస్థానానికి లాగేసింది.
అది కూడా..ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోను.. మరోవైపు ఏపీలో అడుగులు వేసేందుకు కేసీఆర్ సిద్ధమైన సమయంలోను వైసీపీ ప్రభుత్వం విభజన అంశాల అస్త్రాన్ని తెరమీదికి తీసుకువచ్చి.. సుప్రీం గడప తొక్కడం.. రాజకీయంగా కేసీఆర్కు పెను ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఎటు వైపు అనుకూలంగా వ్యవహరించినా.. జాతీయనేతగా.. ఆయనకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఒకటి: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా చూస్తే.. ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంది. దీనికి తెలంగాణ సర్కారు మరో వాదన తెరమీదికి తెచ్చింది. ఎక్కడి ఆస్తులు అక్కడే అని చెబుతోంది. ఇక, ఇప్పుడు సుప్రీం గడప తొక్కిన నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? అనేది ప్రశ్న. ఆయన ఇప్పుడు జాతీయ పార్టీ నాయకుడు కూడా కావడంతో కేవలం తెలంగాణ వాదాన్ని వినిపిస్తే.. ఇబ్బందులు తప్పవు.
అలాగని.. చట్టం ప్రకారం చేయమంటే.. ఏపీకి మెజారిటీ ఆస్తులు దక్కుతాయి. ఇది తెలంగాణ సెంటిమెంటుకు, నిధులు, నీళ్లు, నియామకాలు అన్న కీలక నినాదానికి .. కేసీఆర్ తెరదించేసినట్టు అవుతుంది. అలా కాకుండా.. ఏపీకి ఆ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తే..ఏపీలో ఏ మొహం పెట్టుకుని.. అడుగు పెడతారు? అనేది మరో కీలక ప్రశ్న. ఏపీకి ఇప్పటికే అన్యాయం చేశారనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సయమంలో విభజన షెడ్యూల్లోని 9,10 అంశాల్లోనూ అన్యాయం చేస్తే..ఏపీ ప్రజలు రగిలిపోవడం ఖాయం. సో.. ఎలా చూసుకున్నా.. కేసీఆర్కు ఈ కేసు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 9, 2023 3:30 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…