సమంత అప్ కమింగ్ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత తళుక్కున మెరిసింది. యశోద రిలీజ్ తర్వాత కొన్ని నెలలుగా సమంత ఎక్కడికి వెళ్ళింది ? ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుంటుంది ? అనే విషయాలు బయటికి రాలేదు. తాజాగా ఆమె ముంబై లో సడెన్ గా ప్రత్యక్షమయింది. తాజాగా శాకుంతలం ఈవెంట్ లో కనిపించింది.
అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ లో దర్శకుడు గుణ శేఖర్ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకి దిల్ రాజు ఎలాంటి సపోర్ట్ అందించాడనే విషయం చెప్తూ ఆయన కాసేపు మీడియా ముందే ఏడ్చేశారు. గుణ శేఖర్ కన్నీరు పెట్టుకుంటుంటే ఆయనతో పాటు సమంత కూడా అనుకోకుండా కళ్ళ నీళ్ళతో కనిపించింది. పక్కనే ఉన్న దిల్ రాజుతో ఆయన చెప్తుంటే నేను ఎమోషనల్ అవుతున్నా అంటూ చెప్తూ ఏడ్చేసింది.
తన స్పీచ్ లో సమంత కాస్త ఎమోషనల్ అయింది. కాకపోతే కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాను తను ప్రేమించే విధానం , తనని సినిమా ప్రేమించే విధానం ఏ మాత్రం మారలేదని చెప్పుకుంది. శాకుంతలంతో ఆ ప్రేమ ఇంకా పెరగనుందని తెలిపింది. యశోద ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఏడ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత ఎమోషనల్ వీడియో ఆమె అభిమానుల్ని మరింత బాధకి గురి చేస్తుంది.
This post was last modified on January 9, 2023 4:07 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…