సమంత అప్ కమింగ్ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత తళుక్కున మెరిసింది. యశోద రిలీజ్ తర్వాత కొన్ని నెలలుగా సమంత ఎక్కడికి వెళ్ళింది ? ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుంటుంది ? అనే విషయాలు బయటికి రాలేదు. తాజాగా ఆమె ముంబై లో సడెన్ గా ప్రత్యక్షమయింది. తాజాగా శాకుంతలం ఈవెంట్ లో కనిపించింది.
అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ లో దర్శకుడు గుణ శేఖర్ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకి దిల్ రాజు ఎలాంటి సపోర్ట్ అందించాడనే విషయం చెప్తూ ఆయన కాసేపు మీడియా ముందే ఏడ్చేశారు. గుణ శేఖర్ కన్నీరు పెట్టుకుంటుంటే ఆయనతో పాటు సమంత కూడా అనుకోకుండా కళ్ళ నీళ్ళతో కనిపించింది. పక్కనే ఉన్న దిల్ రాజుతో ఆయన చెప్తుంటే నేను ఎమోషనల్ అవుతున్నా అంటూ చెప్తూ ఏడ్చేసింది.
తన స్పీచ్ లో సమంత కాస్త ఎమోషనల్ అయింది. కాకపోతే కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాను తను ప్రేమించే విధానం , తనని సినిమా ప్రేమించే విధానం ఏ మాత్రం మారలేదని చెప్పుకుంది. శాకుంతలంతో ఆ ప్రేమ ఇంకా పెరగనుందని తెలిపింది. యశోద ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఏడ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత ఎమోషనల్ వీడియో ఆమె అభిమానుల్ని మరింత బాధకి గురి చేస్తుంది.
This post was last modified on January 9, 2023 4:07 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…