సమంత అప్ కమింగ్ హిస్టారికల్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ట్రైలర్ గ్రాండ్ గా రిలీజయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత తళుక్కున మెరిసింది. యశోద రిలీజ్ తర్వాత కొన్ని నెలలుగా సమంత ఎక్కడికి వెళ్ళింది ? ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుంటుంది ? అనే విషయాలు బయటికి రాలేదు. తాజాగా ఆమె ముంబై లో సడెన్ గా ప్రత్యక్షమయింది. తాజాగా శాకుంతలం ఈవెంట్ లో కనిపించింది.
అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ లో దర్శకుడు గుణ శేఖర్ కాస్త ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకి దిల్ రాజు ఎలాంటి సపోర్ట్ అందించాడనే విషయం చెప్తూ ఆయన కాసేపు మీడియా ముందే ఏడ్చేశారు. గుణ శేఖర్ కన్నీరు పెట్టుకుంటుంటే ఆయనతో పాటు సమంత కూడా అనుకోకుండా కళ్ళ నీళ్ళతో కనిపించింది. పక్కనే ఉన్న దిల్ రాజుతో ఆయన చెప్తుంటే నేను ఎమోషనల్ అవుతున్నా అంటూ చెప్తూ ఏడ్చేసింది.
తన స్పీచ్ లో సమంత కాస్త ఎమోషనల్ అయింది. కాకపోతే కన్నీరు రాకుండా కంట్రోల్ చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సినిమాను తను ప్రేమించే విధానం , తనని సినిమా ప్రేమించే విధానం ఏ మాత్రం మారలేదని చెప్పుకుంది. శాకుంతలంతో ఆ ప్రేమ ఇంకా పెరగనుందని తెలిపింది. యశోద ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఏడ్చిన వీడియో బాగా వైరల్ అయింది. తాజాగా శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో సమంత ఎమోషనల్ వీడియో ఆమె అభిమానుల్ని మరింత బాధకి గురి చేస్తుంది.
This post was last modified on January 9, 2023 4:07 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…