వారసుడు ట్రైలర్ వచ్సినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్ గురించి ఇవాళ దిల్ రాజు స్పందించారు. గతంలో చూసిన ఎన్నో సినిమాల మిక్సీగా ఇది ఉందని, వివిధ బ్లాక్ బస్టర్స్ లో ఒక్కో పాయింట్ ని తీసుకుని కథగా అల్లేశారనే ట్వీట్లు వీడియోల సాక్షిగా కుప్పలు తెప్పలు వచ్చి పడ్డాయి. ఒకరకంగా ఇది నెగటివిటీని కూడా తెచ్చి పెట్టింది. వ్యక్తమైన అభిప్రాయాల్లో నిజముందనేలా ఎస్విసి టీమ్ దాన్ని ఎడిట్ చేసిన విధానం కూడా అలాగే ఉంది. సరే ఎవరు ఔనన్నా కాదన్నా కళ్ళముందు కనిపించేది కాదని అనలేరు కాబట్టి రాజుగారి సమాధానం మీద ఆసక్తి రేగింది.
ఇదంతా సబ్జెక్టు ఊహించినప్పుడే అర్థమయ్యిందని ఇంత అనుభవమున్న తాను ఆ మాత్రం పసిగట్టలేనా అని చెబుతూనే విజయ్ ఇమేజ్ కి తగట్టు ఇందులో అన్ని అంశాలు ఉన్నాయని, కేవలం రెండున్నర నిమిషాలకే ఒక కంక్లూజన్ కు రావడం కరెక్ట్ కాదని, ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రేక్షకుడు ఇవన్నీ పట్టించుకోరని కౌంటర్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ పోలికలు అసలు లేవని కానీ, ఇది చాలా ఫ్రెష్ స్టోరీ అని కానీ తీవ్రంగా బుకాయించకపోవడం విశేషం. కంటెంట్ లో బలముంటే అది గతంలో చూశామా లేదా అని ఆడియన్స్ పట్టించుకోరనే లాజిక్ లో నిజం లేకపోలేదు. ధమాకా ఋజువు చేసిందిగా.
ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజు గారి ప్రెస్ మీట్ గురించే వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి బాలకృష్ణల కోసమే త్యాగం చేయాల్సి వచ్చిందన్న ఆయన తెలుగు డబ్బింగ్ వెర్షన్ పనులు ఈ రోజుతో అయిపోతాయని, రేపటికి సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఓవర్సీస్ కి డ్రైవ్ అప్లోడ్ వెళ్లలేదనే సందేహానికి దీన్నుంచి ఆన్సర్ దొరికిపోయింది. పెద్ద సినిమాలకు చివరి నిమిషం హడావిడిలు సహజమే కానీ పక్కా ప్లానింగ్ తో ఉండే దిల్ రాజుకి సైతం ఈ ఇబ్బంది తప్పకపోవడం విచిత్రం. మనకు వారసుడు ఎప్పుడు వచ్చినా వరిసు తమిళ ఫలితం ఇంకో ముప్పై ఆరు గంటల్లో తేలిపోతుంది.
This post was last modified on January 9, 2023 1:30 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…