వారసుడు ట్రైలర్ వచ్సినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్ గురించి ఇవాళ దిల్ రాజు స్పందించారు. గతంలో చూసిన ఎన్నో సినిమాల మిక్సీగా ఇది ఉందని, వివిధ బ్లాక్ బస్టర్స్ లో ఒక్కో పాయింట్ ని తీసుకుని కథగా అల్లేశారనే ట్వీట్లు వీడియోల సాక్షిగా కుప్పలు తెప్పలు వచ్చి పడ్డాయి. ఒకరకంగా ఇది నెగటివిటీని కూడా తెచ్చి పెట్టింది. వ్యక్తమైన అభిప్రాయాల్లో నిజముందనేలా ఎస్విసి టీమ్ దాన్ని ఎడిట్ చేసిన విధానం కూడా అలాగే ఉంది. సరే ఎవరు ఔనన్నా కాదన్నా కళ్ళముందు కనిపించేది కాదని అనలేరు కాబట్టి రాజుగారి సమాధానం మీద ఆసక్తి రేగింది.
ఇదంతా సబ్జెక్టు ఊహించినప్పుడే అర్థమయ్యిందని ఇంత అనుభవమున్న తాను ఆ మాత్రం పసిగట్టలేనా అని చెబుతూనే విజయ్ ఇమేజ్ కి తగట్టు ఇందులో అన్ని అంశాలు ఉన్నాయని, కేవలం రెండున్నర నిమిషాలకే ఒక కంక్లూజన్ కు రావడం కరెక్ట్ కాదని, ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రేక్షకుడు ఇవన్నీ పట్టించుకోరని కౌంటర్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ పోలికలు అసలు లేవని కానీ, ఇది చాలా ఫ్రెష్ స్టోరీ అని కానీ తీవ్రంగా బుకాయించకపోవడం విశేషం. కంటెంట్ లో బలముంటే అది గతంలో చూశామా లేదా అని ఆడియన్స్ పట్టించుకోరనే లాజిక్ లో నిజం లేకపోలేదు. ధమాకా ఋజువు చేసిందిగా.
ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజు గారి ప్రెస్ మీట్ గురించే వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి బాలకృష్ణల కోసమే త్యాగం చేయాల్సి వచ్చిందన్న ఆయన తెలుగు డబ్బింగ్ వెర్షన్ పనులు ఈ రోజుతో అయిపోతాయని, రేపటికి సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఓవర్సీస్ కి డ్రైవ్ అప్లోడ్ వెళ్లలేదనే సందేహానికి దీన్నుంచి ఆన్సర్ దొరికిపోయింది. పెద్ద సినిమాలకు చివరి నిమిషం హడావిడిలు సహజమే కానీ పక్కా ప్లానింగ్ తో ఉండే దిల్ రాజుకి సైతం ఈ ఇబ్బంది తప్పకపోవడం విచిత్రం. మనకు వారసుడు ఎప్పుడు వచ్చినా వరిసు తమిళ ఫలితం ఇంకో ముప్పై ఆరు గంటల్లో తేలిపోతుంది.
This post was last modified on January 9, 2023 1:30 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…