సోషల్ మీడియా కాలంలో ఏది నిజం.. ఏది ఫేక్ అని తెలుసుకోవడం పెద్ద కష్టమైపోయింది. ఎక్కడెక్కడి ఫొటోలో తెచ్చి ఇక్కడివని చూపించి ఎలివేషన్లు ఇస్తుంటారు.. అలాగే అప్రతిష్ట పాలు చేయడానికీ ఇలాంటివి ఉపయోగించుకుంటుంటారు. తెలిసో తెలియకో కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఇలాంటి పొరబాట్లు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన రాజీవ్ కృష్ణ కూడా ఇలాగే చేశారు. అనంతపురంలో 1500 పడకలతో కోవిడ్ ఆసుపత్రిని జగన్ ప్రభుత్వం ఎంత బాగా సిద్ధం చేసిందో చూడమంటూ ఆయన ఒక ట్వీట్ వేశారు. అందులో లోపల బెడ్లతో, అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆసుపత్రి ఫొటోలు కూడా పెట్టారు. ఆ ఫొటోల మీద జగన్ చిత్రాన్ని కూడా పెట్టి ఆయనకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఆయన షేర్ చేసిన ఫొటో అనంతపురానిది కాదని సోషల్ మీడియా జనం పట్టేశారు. కర్ణాటకలో హెచ్సీఎల్ సంస్థ ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రి ఫొటోలవని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై విమర్శకులు, వ్యతిరేకులు చెలరేగిపోయారు. వైకాపా వాళ్లు ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో క్రెడిట్ తీసుకోవడం మామూలే అంటూ పాత, కొత్త విషయాల్ని బయటికి తీసి విమర్శలు గుప్పించారు. ఐతే విషయం కాసేపటికే అంతా పాకిపోవడంతో రాజీవ్ కృష్ణ అప్రమత్తం అయ్యారు.
హుందాగా తప్పు ఒప్పుకున్నారు. ఆ ఫొటో వేరే సోషల్ మీడియా గ్రూప్ షేర్ చేయడం వల్ల తప్పు జరిగిందని.. నిజాయితీగా తప్పును అంగీకరిస్తున్నానని.. ఆ ట్వీట్ను డెలీట్ చేస్తున్నానని మరో ట్వీట్ వేశారు. తెలిసి చేశారో తెలియక చేశారో కానీ.. తన తప్పును హుందాగా అంగీకరించి ఈ వివాదానికి ఇంతటితో తెరదించారు రాజీవ్ కృష్ణ.
This post was last modified on July 20, 2020 11:05 am
సక్సెస్ లేని దర్శకుడితో సినిమా అంటే ఎన్నో లెక్కలుంటాయి. ఆడితే ఓకే కానీ తేడా కొడితే మాత్రం విమర్శల పాలు…
రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన…
ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానులే కాదు సగటు సినీ ప్రియులు సైతం…
వలసవాద బ్రిటీష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్థి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిమినల్ చట్టా లను మార్పు చేశారు.…
కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంతలోనే అతి పెద్ద సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ…
సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా…