సోషల్ మీడియా కాలంలో ఏది నిజం.. ఏది ఫేక్ అని తెలుసుకోవడం పెద్ద కష్టమైపోయింది. ఎక్కడెక్కడి ఫొటోలో తెచ్చి ఇక్కడివని చూపించి ఎలివేషన్లు ఇస్తుంటారు.. అలాగే అప్రతిష్ట పాలు చేయడానికీ ఇలాంటివి ఉపయోగించుకుంటుంటారు. తెలిసో తెలియకో కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఇలాంటి పొరబాట్లు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన రాజీవ్ కృష్ణ కూడా ఇలాగే చేశారు. అనంతపురంలో 1500 పడకలతో కోవిడ్ ఆసుపత్రిని జగన్ ప్రభుత్వం ఎంత బాగా సిద్ధం చేసిందో చూడమంటూ ఆయన ఒక ట్వీట్ వేశారు. అందులో లోపల బెడ్లతో, అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆసుపత్రి ఫొటోలు కూడా పెట్టారు. ఆ ఫొటోల మీద జగన్ చిత్రాన్ని కూడా పెట్టి ఆయనకు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఆయన షేర్ చేసిన ఫొటో అనంతపురానిది కాదని సోషల్ మీడియా జనం పట్టేశారు. కర్ణాటకలో హెచ్సీఎల్ సంస్థ ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రి ఫొటోలవని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై విమర్శకులు, వ్యతిరేకులు చెలరేగిపోయారు. వైకాపా వాళ్లు ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో క్రెడిట్ తీసుకోవడం మామూలే అంటూ పాత, కొత్త విషయాల్ని బయటికి తీసి విమర్శలు గుప్పించారు. ఐతే విషయం కాసేపటికే అంతా పాకిపోవడంతో రాజీవ్ కృష్ణ అప్రమత్తం అయ్యారు.
హుందాగా తప్పు ఒప్పుకున్నారు. ఆ ఫొటో వేరే సోషల్ మీడియా గ్రూప్ షేర్ చేయడం వల్ల తప్పు జరిగిందని.. నిజాయితీగా తప్పును అంగీకరిస్తున్నానని.. ఆ ట్వీట్ను డెలీట్ చేస్తున్నానని మరో ట్వీట్ వేశారు. తెలిసి చేశారో తెలియక చేశారో కానీ.. తన తప్పును హుందాగా అంగీకరించి ఈ వివాదానికి ఇంతటితో తెరదించారు రాజీవ్ కృష్ణ.
This post was last modified on July 20, 2020 11:05 am
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్…
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…