Political News

సాయిరెడ్డి బాధ్యతలు సజ్జల కొడుక్కి..

వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం, పట్టు క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందినవారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి ఓవర్టేక్ చేశారని… సాయిరెడ్డి మేకపోతు గాంభీర్యంతో నెట్టుకొస్తున్నారని అంటున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సాయిరెడ్డి చేతిలో ఉన్న కొద్దిపాటి పవర్స్ కూడా పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.

వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ తానే చూస్తున్నారు విజయసాయిరెడ్డి. దీనికోసం ఆయన భారీ టీంలు ఏర్పాటు చేసుకుని ముందుకుసాగుతున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా విభాగం ఉన్నది వైసీపీకే. వైసీపీ సోషల్ మీడియా విభాగంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం ఏమాత్రం పోటీపడలేని పరిస్థితి. అంతేకాదు.. జాతీయ స్థాయిలో బలమైన సోషల్ మీడియా వింగ్స్ ఉన్న బీజేపీ కూడా ఏపీలో వైసీపీ సోషల్ మీడియా విభాగాలకు ఎదురు నిలవలేని పరిస్థితి.

జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాలు ప్రచారం చేయాలన్నా… ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతల నెగటివ్ పాయింట్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా… చివరకు న్యాయమూర్తుల విషయంలో దూకుడుగా వ్యవహరించాలన్నా.. తిమ్మిని బమ్మి చేయాలన్నా… మెయిన్ స్ట్రీమ్ మీడియాను డిఫెన్స్‌లో పడేయాలన్నా.. వారిని ప్రభావితం చేయాలన్నా… ఏదైనా వైసీపీ సోసల్ మీడియా విభాగాలకే సాధ్యం. అంత పటిష్ఠంగా, పదునుగా తయారు చేశారు విజయసాయిరెడ్డి. ఏమాటాకామాట చెప్పుకోవాలి ఈ క్రెడిటంతా విజయసాయిరెడ్డిదే. వైసీపీ సోషల్ మీడియా కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసేవారు సుశిక్షితులైన సైనికుల్లా… సేనాధిపతి ఆదేశాలను తూచా తప్పుకుండా పాటించి శత్రువులపై దాడికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

అలాంటి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇప్పుడు విజయసాయిరెడ్డి చేతుల నుంచి జారిపోయాయి. వైసీపీ సోషల్ మీడియా హెడ్‌గా భార్గవరెడ్డిని నియమించారు జగన్. భార్గవ్ రెడ్డి అంటే ఎవరో కాదు… సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు.

వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు భార్గవరెడ్డికి ఇవ్వాలని రెండు నెలల కిందటే నిర్ణయించినా బుధవారం ఆ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు. ఈ బాధ్యతేకాదు.. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్న మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలూ భార్గవరెడ్డికే ఇచ్చారు.

సజ్జల కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించడంతో విజయసాయిరెడ్డికి ఇబ్బందేనంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు, టీడీపీ నుంచి తనకు ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడానికి.. తాను వారిపై చేసే విమర్శలను ముందుకు తీసుకెళ్లడానికి వైసీపీ సోషల్ మీడియాను సాయిరెడ్డి విపరీతంగా వాడుకున్నారు. ఇకపై ఆయనకు ఆ అవకాశం ఎంతవరకు ఉంటుందనేది చూడాలి.

అయితే… ఇలాంటివి ముందుగానే ఊహించారో ఏమో కానీ చాలాకాలంగా విజయసాయిరెడ్డి సొంతంగా ఓ సోషల్ మీడియా వింగ్ కూడా నడుపుతున్నారు. వారిపని విజయసాయిరెడ్డి ఇమేజ్ బిల్డ్ చేయడం, ఆయనపై విమర్శలను తిప్పికొట్టడం, ప్రత్యర్థులుపై ఎదురుదాడి చేయడమే. పార్టీ సోషల్ మీడియా చేజారినా సొంత సోషల్ మీడియా చేతిలో ఉండడంతో విజయసాయిరెడ్డి ఎప్పటిలాగే దూకుడు చూపుతారంటున్నారు ఆయన వర్గం వారు.

Satya

Recent Posts

రాజధాని విషయంలో జగన్ లక్ష్యమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎప్పుడెలా మారిపోతుందో తెలియక జనాలే కాదు.. ఆ పార్టీ నేతలు…

12 minutes ago

దీపిక బాట‌లో కాజ‌ల్… కొన్ని గంటలే…!

రోజుకు 8 గంట‌లకు మించి ప‌ని చేయ‌నంటూ ఈ మ‌ధ్య దీపిక ప‌దుకొనే ఫిలిం మేక‌ర్స్‌కు కండిష‌న్ పెట్ట‌డం ఎంత…

1 hour ago

ఆసుపత్రిలో చెత్త కనిపిస్తే చంద్రబాబు ఊరుకుంటారా?

నిజమే... టీడీపీ అదినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఏ విషయంలో అయినా అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఏ…

3 hours ago

Pics: బ్యాంకాక్‌ ను షేక్ చేసిన మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన షిసెడో…

4 hours ago

బేబీ బంప్‌తో మెరిసిన మ్యాడ్ భామ

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి…

7 hours ago

దురంధర్ దెబ్బ మామూలుది కాదు

దురంధర్ రాకముందు స్పై యాక్ష‌న్ సినిమాల‌తో ఒక‌ప్పుడు బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల పంట పండించుకున్నారు. ముఖ్యంగా…

8 hours ago