Political News

సాయిరెడ్డి బాధ్యతలు సజ్జల కొడుక్కి..

వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం, పట్టు క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందినవారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి ఓవర్టేక్ చేశారని… సాయిరెడ్డి మేకపోతు గాంభీర్యంతో నెట్టుకొస్తున్నారని అంటున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సాయిరెడ్డి చేతిలో ఉన్న కొద్దిపాటి పవర్స్ కూడా పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.

వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ తానే చూస్తున్నారు విజయసాయిరెడ్డి. దీనికోసం ఆయన భారీ టీంలు ఏర్పాటు చేసుకుని ముందుకుసాగుతున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా విభాగం ఉన్నది వైసీపీకే. వైసీపీ సోషల్ మీడియా విభాగంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం ఏమాత్రం పోటీపడలేని పరిస్థితి. అంతేకాదు.. జాతీయ స్థాయిలో బలమైన సోషల్ మీడియా వింగ్స్ ఉన్న బీజేపీ కూడా ఏపీలో వైసీపీ సోషల్ మీడియా విభాగాలకు ఎదురు నిలవలేని పరిస్థితి.

జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాలు ప్రచారం చేయాలన్నా… ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతల నెగటివ్ పాయింట్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా… చివరకు న్యాయమూర్తుల విషయంలో దూకుడుగా వ్యవహరించాలన్నా.. తిమ్మిని బమ్మి చేయాలన్నా… మెయిన్ స్ట్రీమ్ మీడియాను డిఫెన్స్‌లో పడేయాలన్నా.. వారిని ప్రభావితం చేయాలన్నా… ఏదైనా వైసీపీ సోసల్ మీడియా విభాగాలకే సాధ్యం. అంత పటిష్ఠంగా, పదునుగా తయారు చేశారు విజయసాయిరెడ్డి. ఏమాటాకామాట చెప్పుకోవాలి ఈ క్రెడిటంతా విజయసాయిరెడ్డిదే. వైసీపీ సోషల్ మీడియా కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసేవారు సుశిక్షితులైన సైనికుల్లా… సేనాధిపతి ఆదేశాలను తూచా తప్పుకుండా పాటించి శత్రువులపై దాడికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

అలాంటి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇప్పుడు విజయసాయిరెడ్డి చేతుల నుంచి జారిపోయాయి. వైసీపీ సోషల్ మీడియా హెడ్‌గా భార్గవరెడ్డిని నియమించారు జగన్. భార్గవ్ రెడ్డి అంటే ఎవరో కాదు… సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు.

వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు భార్గవరెడ్డికి ఇవ్వాలని రెండు నెలల కిందటే నిర్ణయించినా బుధవారం ఆ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు. ఈ బాధ్యతేకాదు.. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్న మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలూ భార్గవరెడ్డికే ఇచ్చారు.

సజ్జల కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించడంతో విజయసాయిరెడ్డికి ఇబ్బందేనంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు, టీడీపీ నుంచి తనకు ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడానికి.. తాను వారిపై చేసే విమర్శలను ముందుకు తీసుకెళ్లడానికి వైసీపీ సోషల్ మీడియాను సాయిరెడ్డి విపరీతంగా వాడుకున్నారు. ఇకపై ఆయనకు ఆ అవకాశం ఎంతవరకు ఉంటుందనేది చూడాలి.

అయితే… ఇలాంటివి ముందుగానే ఊహించారో ఏమో కానీ చాలాకాలంగా విజయసాయిరెడ్డి సొంతంగా ఓ సోషల్ మీడియా వింగ్ కూడా నడుపుతున్నారు. వారిపని విజయసాయిరెడ్డి ఇమేజ్ బిల్డ్ చేయడం, ఆయనపై విమర్శలను తిప్పికొట్టడం, ప్రత్యర్థులుపై ఎదురుదాడి చేయడమే. పార్టీ సోషల్ మీడియా చేజారినా సొంత సోషల్ మీడియా చేతిలో ఉండడంతో విజయసాయిరెడ్డి ఎప్పటిలాగే దూకుడు చూపుతారంటున్నారు ఆయన వర్గం వారు.

This post was last modified on January 5, 2023 9:40 am

Share
Show comments

Recent Posts

తప్పు ఒప్పేసుకున్న వీరభద్రుడు

బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…

9 minutes ago

భోపాల్ భుజాల మీద బజ్ భారం

హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…

26 minutes ago

మైక్‌తో పాటు హెల్మెంట్ తీసుకెళ్లండి.. మనోజ్ పంచ్

మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…

47 minutes ago

దారుణం… సినిమా ఆశ చూపి లైంగిక దాడి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్‌లోని గదికి…

1 hour ago

రాహుల్ కాదంటే… రేవంతే ప్ర‌ధానా?!

రాహుల్ గాంధీకి ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే రాహుల్ ను ప్ర‌దానిని చేసేందుకు…

2 hours ago

విజయ్ గెలిచింది ‘ఇన్ స్టాగ్రామ్’ తోనా…?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…

2 hours ago