ఏపీలో రాజకీయ సంచలనం అని కొందరు అంటున్నా.. అంతటి రేంజ్ అయితే.. కాకపోయినా.. కొందరు మాత్రం వెళ్లి భారత రాష్ట్ర సమితి.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడం మాత్రం సహజంగానే రాజకీయాలను వేడెక్కించింది. తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్బాబులు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షం లో బీఆర్ఎస్ గూటికి చేరుకున్న దరిమిలా..ఏపీలో ఏదో జరిగిపోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.
అయితే.. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తోట చంద్రశేఖర్ కానీ, పార్టీలో చేరిన రావెల కిశోర్ బాబుల విశ్వసనీయత ఎంత? వీరి ప్రభావం ఎంత? ఏపీలో వీరు ఏ మేరకు పార్టీని పుంజుకునేలా చేస్తారు? అసలు.. వీరి ముఖాలు.. ఎంత మందికి తెలుసు? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇద్దరూ కూడా ఆయారాం.. గయారాం బ్యాచ్ నాయకులుగానే పేరు తెచ్చుకున్నారు.
పైగా.. స్థిరమైన రాజకీయాలు చేసింది కూడా లేదనే టాక్ ఉంది. ఇద్దరూ కూడా.. పెద్ద వాయిస్ ఉన్న నాయకులు కానీ, ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలు కానీ.. కాకపోవడం గమనార్హం. దీంతో ఇద్దరి విషయం పై ఎలాంటి స్పందనా రావడం లేదు. తోట చంద్రశేఖర్.. ఇప్పటివరకు ప్రజారాజ్యం నుంచి వైసీపీ వరకు.. అక్కడ నుంచి జనసేన వరకు.. అనేక పార్టీలు మారారు.
ఈ క్రమంలో ఆయన గుంటూరు, ఏలూరుల నుంచి కూడా పోటీ చేశారు. అయినా..ఒక్కచోట కూడా విజయం దక్కించుకోలేక పోయారు. అంతేకాదు.. కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ.. తోటకు ప్రజాదరణ లేదనేది వాస్తవం. ఇక, రావెల విషయానికి వస్తే.. ఈయన కూడా అన్ని పార్టీలనూ టచ్ చేశారు. ఒక్క వైసీపీ మినహా.. టీడీపీ, బీజేపీ, జనసేనల్లో చేరడం.. రావడం.. వంటివి అయిపోయాయి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రావెల ప్రజలపై చూపించే ప్రభావం పెద్దగా లేదు.
పైగా రావెల కుమారుడిపై ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన విమర్శలకు.. వివాదాలకు అవకాశం ఇచ్చారు. సో.. ఎలా చూసుకున్నా.. ఇద్దరి ఎంపికను పరిశీలిస్తే.. ఏపీలో బీఆర్ఎస్ ఎలా ముందుకు నడుస్తుందనే విషయం స్ఫష్టం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 3, 2023 11:30 am
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…