జనసేనాని పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైన వైసీపీ విమర్శల వర్షానికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా సీఎం జగన్ మరోసారి పవన్ భార్యల గురించి నోరు పారేసుకున్నారు. నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మరోమారు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
‘ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు . ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో’ అని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన దత్తపుత్రుడు కూడా ‘ఈ భార్య కాకపోతే ఆ భార్యతో’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇది వీరి సరళి అని పవన్ కల్యాణ్ ఉద్దేశించి విమర్శించారు. అంతటితో ఆగకుండా ‘ఒకాయన (పవన్ కల్యాణ్) రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు గడిచింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ్రజలు ఓడించారు. ఈయనకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే’ అని ఎద్దేవా చేశారు.
ఏపీలో జనసేన, వైసీపీ నేతల మధ్యి ఇటీవల కాలంలో విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. కాపు ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే కూడా సీఎం జగన్ ఒకసారి పవన్ కల్యాణ్ భార్యల గురించి పరోక్ష విమర్శలు చేయడం వైరల్గా మారింది. ఇప్పుడు మరోమారు ఆయన అదే విమర్శలు పునరుద్ఘాటించడంతో జనసైనికులు ఏ స్థాయిలో స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…