ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇకలేరు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు.
కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్లోని మెహసానాలో ఉన్న వాద్నగర్ లో 1923వ సంవత్సరంలో జన్మించిన హీరాబెన్.. చిన్ననాటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. భర్త దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ టీ వ్యాపారం చేసేవారు. ఈ దంపతులకు ప్రధాని మోదీ సహా ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మూడో కుమారుడైన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 18న వందవ పుట్టినరోజు జరుపుకున్న హీరాబెన్ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీల్ ఛైర్ లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని హీరాబెన్ స్వాగతించారు. అప్పట్లో నోట్ల రద్దుకు మద్దతుగా బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి మరీ పాతనోట్లను మార్చుకుని ప్రజల్లో స్ఫూర్తినింపారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
This post was last modified on December 30, 2022 9:17 am
తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…