ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇకలేరు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు.
కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్లోని మెహసానాలో ఉన్న వాద్నగర్ లో 1923వ సంవత్సరంలో జన్మించిన హీరాబెన్.. చిన్ననాటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. భర్త దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ టీ వ్యాపారం చేసేవారు. ఈ దంపతులకు ప్రధాని మోదీ సహా ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మూడో కుమారుడైన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 18న వందవ పుట్టినరోజు జరుపుకున్న హీరాబెన్ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీల్ ఛైర్ లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని హీరాబెన్ స్వాగతించారు. అప్పట్లో నోట్ల రద్దుకు మద్దతుగా బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి మరీ పాతనోట్లను మార్చుకుని ప్రజల్లో స్ఫూర్తినింపారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
This post was last modified on December 30, 2022 9:17 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…