Political News

ప్ర‌ధాని మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ క‌న్నుమూత

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇక‌లేరు. ఈ రోజు తెల్ల‌వారు జామున 3 గంట‌ల 30 నిమిషాల స‌మ‌యంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు.

కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్‌లోని మెహసానాలో ఉన్న వాద్‌నగర్ లో 1923వ సంవ‌త్స‌రంలో జన్మించిన హీరాబెన్.. చిన్ననాటి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్ మోదీ టీ వ్యాపారం చేసేవారు. ఈ దంపతులకు ప్రధాని మోదీ సహా ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మూడో కుమారుడైన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 18న వందవ పుట్టినరోజు జరుపుకున్న హీరాబెన్ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీల్ ఛైర్ లో వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని హీరాబెన్ స్వాగతించారు. అప్పట్లో నోట్ల రద్దుకు మద్దతుగా బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి మరీ పాతనోట్లను మార్చుకుని ప్రజల్లో స్ఫూర్తినింపారు. హీరాబెన్ మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

This post was last modified on December 30, 2022 9:17 am

Share

Recent Posts

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

2 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

3 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

9 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

9 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

12 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

12 hours ago