ఏపీలో కాపు సామాజిక వర్గం కేంద్రంగా YCP నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వింతగొలుపుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని.. కాపోడు ముఖ్యమంత్రి అయితే.. అవనివ్వండి! అని వ్యాఖ్యానించిన రెండో రోజే మంత్రి అంబటి రాంబాబు అదే సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులంతా కలిసి పవన్ నేతృత్వంలో చంద్రబాబు దగ్గర ఊడిగం చేయండి.. అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
“గతంలో చంద్రబాబును నమ్మారు.. ఇప్పుడు పవన్ను గోకుతున్నారు. గోకి గోకి.. మళ్లీ వెళ్లి బాబు కాళ్ల దగ్గర చాకిరీ చేయిండి” అని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
Chandrababuకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. జగన్ రెడ్డి ని నమ్ముకున్న Ambati వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. పవన్పై మరింత జోరుగా అంబటి విరుచుకుపడ్డారు. బుద్ధి.. జ్ఞానం లేని Pawan kalyanకు రాజకీయాలు ఏం తెలుసు అని ప్రశ్నించారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఓట్లు చీలనివ్వను అంటాడు.. అంత పెద్ద మగాడా పవన్ అంటూ చెలరేగిపోయారు. “కాపులంతా మా పవన్.. మా పవన్ అంటూ గోక్కుంటున్నారు. గోక్కుని.. గోక్కుని చంద్రబాబు దగ్గర పవన్తో కలిసి చాకిరి చేయండి” అంటూ మండిపడ్డారు.
ఒక్కచోట కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేస్తాడా? అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాళ్ల మీద పడి పవన్ను ఏడవమనండి అని రుసరుసలాడారు. వైసీపీలో తాను విమర్శించినంత ఘాటుగా పవన్ను ఎవరూ విమర్శించరని చెప్పారు. అందుకే తనను టార్గెట్ చేసుకొని పవన్ ఆరోపణలు చేస్తున్నాడంటూ ఫైరయ్యారు.
కాపులను చంద్రబాబు దొడ్లో కట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తాను ఒక్కపైసా ఆశించానా? అయినా కూడా తనపైనే ఆరోపణలు చేస్తాడా..? అంటూ పవన్కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర పరుషపదజాలంతో ఊగిపోయారు.
This post was last modified on December 28, 2022 7:35 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…