పొరుగున ఉన్న తెలంగాణలో Chandrababu Naidu ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. పార్టీ నుంచి దూరమైన వారు వెంటనే వచ్చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేస్తే.. మనం బలోపేతం అవుతామని చెబుతున్నారు. కానీ, అదేసమయంలో ఏపీలో అధికారంలోకి వస్తామని చెబుతున్న చంద్రబాబు మాత్రం.. ఇక్కడ ఘర్ వాపసీ పిలుపునివ్వడం లేదు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
గత ఎన్నికల తర్వాత.. TDP నుంచి చాలా మంది BJPలోకి వెళ్లిపోయారు. మరికొందరు YCPకి అనుబంధంగా పనిచేస్తున్నారు. వీరిలో గెలిచన వారు నలుగురే ఉన్నప్పటికీ.. గెలవనివారు.. కూడా అంతర్గతంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నవారు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు వీరిని ఎందుకు ఫోకస్ చేయడం లేదు? అనేది ప్రశ్న. నిజానికి చంద్రబాబు పిలుపునిస్తే.. వారంతా వచ్చేందుకురెడీగానే ఉన్నారని ఒక ప్రచారం ఉంది.
ఉదాహరణకు గత ఎన్నికలకు ముందు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటివారు బీజేపీలోకి వెళ్లారు. అయితే..వీరిని ఉద్దేశ పూర్వకంగా పంపించారనే వాదన ఉంది. ఇది ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికలకు ముందు.. వీరితో చాలా పని ఉంది. అదేసమయంలో చాలా జిల్లాల్లో ముఖ్యంగా సీమలో అయితే.. ఖచ్చితంగా.. టీడీపీకి చెందిన చాలా మంది నాయకులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
లేకపోతే.. బలమైన స్థానాల్లో కూడా.. కార్పొరేషన్లను టీడీపీ పోగొట్టు కోవడమే కాదు.. కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయితే.. ఇప్పుడు ఘర్ వాపసీ మంత్రాన్నిజపిస్తే.. వారంతా తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. కానీ, బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో.. అనే ఆవేదన కూడా కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు అందుకే ఏపీలో మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు.
This post was last modified on December 26, 2022 8:34 pm
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…