పొరుగున ఉన్న తెలంగాణలో Chandrababu Naidu ఘర్ వాపసీ పిలుపునిచ్చారు. పార్టీ నుంచి దూరమైన వారు వెంటనే వచ్చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేస్తే.. మనం బలోపేతం అవుతామని చెబుతున్నారు. కానీ, అదేసమయంలో ఏపీలో అధికారంలోకి వస్తామని చెబుతున్న చంద్రబాబు మాత్రం.. ఇక్కడ ఘర్ వాపసీ పిలుపునివ్వడం లేదు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
గత ఎన్నికల తర్వాత.. TDP నుంచి చాలా మంది BJPలోకి వెళ్లిపోయారు. మరికొందరు YCPకి అనుబంధంగా పనిచేస్తున్నారు. వీరిలో గెలిచన వారు నలుగురే ఉన్నప్పటికీ.. గెలవనివారు.. కూడా అంతర్గతంగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నవారు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు వీరిని ఎందుకు ఫోకస్ చేయడం లేదు? అనేది ప్రశ్న. నిజానికి చంద్రబాబు పిలుపునిస్తే.. వారంతా వచ్చేందుకురెడీగానే ఉన్నారని ఒక ప్రచారం ఉంది.
ఉదాహరణకు గత ఎన్నికలకు ముందు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటివారు బీజేపీలోకి వెళ్లారు. అయితే..వీరిని ఉద్దేశ పూర్వకంగా పంపించారనే వాదన ఉంది. ఇది ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికలకు ముందు.. వీరితో చాలా పని ఉంది. అదేసమయంలో చాలా జిల్లాల్లో ముఖ్యంగా సీమలో అయితే.. ఖచ్చితంగా.. టీడీపీకి చెందిన చాలా మంది నాయకులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
లేకపోతే.. బలమైన స్థానాల్లో కూడా.. కార్పొరేషన్లను టీడీపీ పోగొట్టు కోవడమే కాదు.. కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయితే.. ఇప్పుడు ఘర్ వాపసీ మంత్రాన్నిజపిస్తే.. వారంతా తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. కానీ, బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో.. అనే ఆవేదన కూడా కనిపిస్తోందని అంటున్నారు. చంద్రబాబు అందుకే ఏపీలో మౌనంగా ఉంటున్నారని చెబుతున్నారు.
This post was last modified on December 26, 2022 8:34 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…