ప్రముఖులు ఇప్పుడు ఎలా స్పందించినా..దానివెనుక కారణాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో కారణం లేకుండా.. ఎవరూ కూడా ఏపనీ చేయబోరని కూడా అంటారు కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన ప్రకటనపై కూడా ఇలాంటివిశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా చిరు చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది.
భవిష్యత్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించాను. ఇక చాలు. నా కుటుంబసభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు. దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వస్తారా.. రారా అనేది పక్కన పెడితే.. ఈ సందర్భంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చిరు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా అభిమానులు అందరూ కూడా పవన్ వెంట నిలబడాలని ఆయన ఇప్పటికే అంతర్గతంగా వారికి ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా.. తాను సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు.
ఇలా చూస్తే.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చినా..ఏపీకి ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా పవన్కు లాభిస్తుందని.. ఎన్నికల ముందు చిరు చేసే సామాజిక కార్యక్రమం ఏదైనా కూడా.. పవన్కు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
This post was last modified on December 25, 2022 12:59 pm
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…