ప్రముఖులు ఇప్పుడు ఎలా స్పందించినా..దానివెనుక కారణాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో కారణం లేకుండా.. ఎవరూ కూడా ఏపనీ చేయబోరని కూడా అంటారు కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన ప్రకటనపై కూడా ఇలాంటివిశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా చిరు చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది.
భవిష్యత్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించాను. ఇక చాలు. నా కుటుంబసభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు. దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వస్తారా.. రారా అనేది పక్కన పెడితే.. ఈ సందర్భంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చిరు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా అభిమానులు అందరూ కూడా పవన్ వెంట నిలబడాలని ఆయన ఇప్పటికే అంతర్గతంగా వారికి ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా.. తాను సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు.
ఇలా చూస్తే.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చినా..ఏపీకి ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా పవన్కు లాభిస్తుందని.. ఎన్నికల ముందు చిరు చేసే సామాజిక కార్యక్రమం ఏదైనా కూడా.. పవన్కు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
This post was last modified on December 25, 2022 12:59 pm
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…