ప్రముఖులు ఇప్పుడు ఎలా స్పందించినా..దానివెనుక కారణాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో కారణం లేకుండా.. ఎవరూ కూడా ఏపనీ చేయబోరని కూడా అంటారు కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన ప్రకటనపై కూడా ఇలాంటివిశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా చిరు చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది.
భవిష్యత్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించాను. ఇక చాలు. నా కుటుంబసభ్యులు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. భగవంతుడు నాకు అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు. దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతున్నా’ అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు.
అయితే.. ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వస్తారా.. రారా అనేది పక్కన పెడితే.. ఈ సందర్భంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చిరు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా అభిమానులు అందరూ కూడా పవన్ వెంట నిలబడాలని ఆయన ఇప్పటికే అంతర్గతంగా వారికి ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా.. తాను సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు.
ఇలా చూస్తే.. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చినా..ఏపీకి ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా పవన్కు లాభిస్తుందని.. ఎన్నికల ముందు చిరు చేసే సామాజిక కార్యక్రమం ఏదైనా కూడా.. పవన్కు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…