Political News

తెలంగాణ‌ లోనే కాదు.. అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా!

తెలుగు వాళ్లు ఎక్క‌డుంటే.. అక్క‌డ రాజ‌కీయం చేస్తాన‌ని.. త‌న‌ను ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని .. టీడీపీ అధినేత అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అంతేకాదు.. తెలంగాణ‌లో రాజ‌కీయం త‌న‌కు కొత్త‌కాద‌ని.. త‌ను ఎక్క‌డున్నా.. అభిమానించే తెలుగు వారు ఉన్నార‌ని చెప్పారు. తెలంగాణ‌ను అభివృద్ధి చేసింది తానేన‌ని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు చేస్తుంటే.. కొంద‌రు వ‌ణికి పోతున్నారంటూ.. సీఎం జ‌గ‌న్‌ పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్తితిలో ఉన్న సీఎం జ‌గ‌న్‌. మూడు రాజ‌ధానులు ఎలా క‌డ‌తాడ‌ని ప్ర‌శ్నించారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి రోడ్ షోలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపైనా, తాజాగా క‌డ‌ప స‌భ‌లో సీఎం జ‌గ‌న్ చేసిన‌.. కామెంట్ల పైనా బాబు విరుచుకు పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ చర్యల వల్ల అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఫైనాన్షియల్‌, టూరిజం హబ్‌గా మారాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని.. వారి విషయంలో ప్రభుత్వం తీరు దారుణంగా ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

వైసీపీ పాలనలో రైతులు ఆనందంగా లేరని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం సమయంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. నాయకత్వంలోనూ మహిళలు పోరాడాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.

తెలంగాణ‌లోనే కాదు.. అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా!

తెలుగువారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అది తెలంగాణ అయినా.. అమెరికా అయినా.. ఎక్కడైనా తెలుగువారి కోసం రాజ‌కీయంగా అండగా ఉంటానని చెప్పారు. తెలుగు వారి కోసమే తెలుగు దేశం పార్టీ పుట్టిందని ఉద్ఘాటించారు. దీనిపై కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. అయినా.. త‌న‌ను ఎవ‌రూ ఆపలేర‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago