సీఎం జగన్ వస్తున్నాడంటే.. రెండు రోజుల ముందు నుంచే చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. మరి అలాంటి ప్రొటోకాల్లో ఉన్న నాయకుడు.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫ్లెక్సీలను కట్టడమే కానీ.. చింపడం .. తెలియని.. ఏపీలో ఇప్పుడు అవే ఫ్లెక్సీలను చింపేస్తున్నారు. ధిక్కారమున్ సైతువా.. కాదు.. చేస్తున్నారు. వర్గపోరులో.. సీఎం కూడా ఒక భాగం అయిపోయారు. అది కూడా బలమైన నెల్లూరు జిల్లాలోనే కావడం.. అది కూడా రెడ్డి వర్గంలోనే కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వైసీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన కేంద్రంగానే వర్గ పోరు ప్రారంభమైంది. సొంత పార్టీ నేతలే సీఎం జగన్ ఫ్లెక్సీలను చింపేసి మరీ అవమానించే పరిస్థితి వచ్చింది. గ్రూపు తగాదాల కారణంగా జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు ఒకచోట చించివేస్తే.. మరోచోట అనుమతుల పేరుతో తొలగించారు. ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తీరుపై అధిష్టానానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ ఫోటోలతో ఉదయగిరిలో మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం కట్టిన ఫ్లెక్సీలను చించివేశారు. అటు వింజమూరులో ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అనుమతులు లేవంటూ పంచాయతీ సిబ్బంది తొలగించడం వైసీపీ ద్వితీయ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం.
ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలను ఎమ్మెల్యే, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, మాజీ ఏఎంసీ ఆలీ అహ్మద్లు విడి విడిగా జరుపుకొన్నారు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలానే జరిగింది. ఎమ్మెల్యే మేకపాటికి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న నాయకులు వేర్వేరుగా రాజకీయాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉదయగిరి వైసీపీ రాజకీయం వేడెక్కింది.
This post was last modified on December 23, 2022 9:47 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…