లేస్తే.. తగ్గేదేలేదు..! అన్నట్టుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై నిప్పులు చెరిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గతం లోనూ ధాన్యం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంతో రోడ్డెక్కారు . సీఎంగా ఉంటూనే.. ఇందిరా పార్కు దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఇక, అదేవిధంగా ఇతర సమస్యలపైనా కేంద్రాన్ని ఆయన నిలదీస్తున్నారు. తాజాగా కూడా ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులను రైతుల కల్లాలకు.. సంబంధించి ఖర్చు చేయడంపైనా.. కేంద్రం తాఖీదులు పంపించడాన్ని తప్పు బట్టారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే.. వీటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రబుత్వానికి కేంద్రం ఇవ్వాల్సిన సొమ్ము 40 వేల కోట్లు ఇవ్వక, తాము అప్పులు చేసుకుంటామంటే కూడా సహకరించడం లేదని సీఎం కేసీఆర్ తరచుగా చెబుతున్నారు. ఈ క్రమంలో దీనిని నిరసించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఏదో సాధారణ నిరసన కాకుండా.. అసెంబ్లీ వేదికగానే నిప్పులు చెరిగి రికార్డు సృష్టించి..కేంద్రానికి ఒక తీర్మానం పంపాలని కూడా పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. గత నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ(డిసెంబరులో చేయాలని) పెద్ద ఎత్తున ఉన్నతాధికారులతోనూ సమాలోచనలు జరిపారు.
డిసెంబరు తొలి, రెండోవారం.. మూడో వారంలో సమావేశాలు ఉంటాయని.. తెలంగాణ మంత్రులు, నాయకులు కూడా చూచాయగా మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే.. డిసెంబరు 23వ తేదీ దాటిపోయినా.. కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. అంటే.. సభ పెట్టేందుకు ఆయన ఎందుకో వెనక్కి తగ్గారనే భావన వ్యక్తమవుతోంది. దీనికి కారణాలు తెలియక పోయినా.. ప్రస్తుతం ఇది సరైన సమయం కాదని అనుకున్నారో.. లేక అసెంబ్లీ వేదికగా కన్నా.. జాతీయస్థాయిలో వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి మోడీని, కేంద్రాన్ని దుమ్ముదులపాలని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ.. కేసీఆర్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు.
ఇక, సభల విషయానికి వస్తే.. ఇక, ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఎలానూ ఫిబ్రవరి తొలి వారంలో కేంద్రం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. దీని తర్వాత.. ఏపీ, తెలంగాణ సహా.. దక్షిణాదిరాష్ట్రాలు.. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. సో.. ఇక, అప్పుడే తాడో పేడో తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారనే వాదన వినిపిస్తోంది. అప్పుడైతే.. ఎలానూ కేంద్ర బడ్జెట్ వచ్చేస్తుంది. తెలంగాణకు ఏమిచ్చారు. దేశానికి(ప్రస్తుతం జాతీయ పార్టీ కదా) ఏమిచ్చారు..వంటి కీలక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని వాటిని కూడా ఒకే సారి రేవు పెడతారేమో చూడాలి.
This post was last modified on December 23, 2022 9:39 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…