ఏపీ సీఎం జగన్ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై కలిపి ఆయన కామెంట్లు సంధించారు. ప్రస్తుతం కడప పర్యట నలో ఉన్న జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఒకటి పోతే.. ఇంకొకటి ఆప్షన్ లేదని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే నమ్ముకుని ఉన్నానని చెప్పారు. ఏపీ ప్రజలతోనే తన రాజకీయాలు ఉంటాయన్నారు.
తనకు మరో రాష్ట్రం.. మరో రాజకీయం లేదని.. అవసరం రాదని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా ఒక రాష్ట్రంపోతే.. మరో రాష్ట్రంలోనో.. ఒక పార్టీ పోతే.. మరో పార్టీ అనో(పొత్తులు) నేను అనడం లేదు. నాకు ఏపీ ఒక్కరాష్ట్రమే ఉంది. ఒక పార్టీనే ఉంది. ఒక్క రాష్ట్రప్రజలే ఉన్నారు. వారితోనే నా రాజకీ యం అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, ఇదేసమయంలో పవన్పైనా సటైర్లు వేశారు. చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఒక భార్య పోతో ఇంకో భార్య అనో నేను అనడం లేదు. నాది ఒకే రాష్ట్రం.. ఒకే ప్రజలు.. ఒకేపార్టీ.. ఒకే రాజకీయం. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా రాజకీయం.. ఇదే నా రాష్ట్రం అని జగన్ స్పష్టంచేశారు.
This post was last modified on December 23, 2022 6:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…