ఏపీ సీఎం జగన్ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై కలిపి ఆయన కామెంట్లు సంధించారు. ప్రస్తుతం కడప పర్యట నలో ఉన్న జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఒకటి పోతే.. ఇంకొకటి ఆప్షన్ లేదని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే నమ్ముకుని ఉన్నానని చెప్పారు. ఏపీ ప్రజలతోనే తన రాజకీయాలు ఉంటాయన్నారు.
తనకు మరో రాష్ట్రం.. మరో రాజకీయం లేదని.. అవసరం రాదని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా ఒక రాష్ట్రంపోతే.. మరో రాష్ట్రంలోనో.. ఒక పార్టీ పోతే.. మరో పార్టీ అనో(పొత్తులు) నేను అనడం లేదు. నాకు ఏపీ ఒక్కరాష్ట్రమే ఉంది. ఒక పార్టీనే ఉంది. ఒక్క రాష్ట్రప్రజలే ఉన్నారు. వారితోనే నా రాజకీ యం అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, ఇదేసమయంలో పవన్పైనా సటైర్లు వేశారు. చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఒక భార్య పోతో ఇంకో భార్య అనో నేను అనడం లేదు. నాది ఒకే రాష్ట్రం.. ఒకే ప్రజలు.. ఒకేపార్టీ.. ఒకే రాజకీయం. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా రాజకీయం.. ఇదే నా రాష్ట్రం అని జగన్ స్పష్టంచేశారు.
This post was last modified on December 23, 2022 6:41 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…