Political News

ఒకేసారి 6 వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పవన్ కల్యాణ్

ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన రాక సందర్భంగా కాస్తంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకూ పవన్ కల్యాణ్ ఆర్టీవో ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.

తాజాగా ఆయన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు అప్లికేషన్ పెట్టేందుకు ఆయన ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు.. తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఆయన ఆపీసుకు వచ్చారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వేళకు ఆయనకు స్లాట్ కేటాయించారు. చెప్పిన సమయానికి కాస్తంత ముందుగానే పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు చేరుకున్నారు.

నిజానికి ఉదయమే స్లాట్ ఇచ్చేందుకు రవాణా శాఖా అధికారులు సిద్ధమైనా.. తన కారణంగా ఆఫీసు పరిసరాల్లో ఇబ్బందికర వాతావరణం ఎదురు కాకుండా ఉండేందుకు నాన్ పీక్ సమయంలో వచ్చేందుకు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. కేటాయించిన సమయానికి కాస్తంత ముందుగానే వచ్చిన పవన్ కల్యాణ్.. రవాణా శాఖ ఉప కమిషనర్ పాపారావును కలిశారు.

ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ లో.. ఆయనకు సంబంధించిన ఆరు వాహనాల్ని అర గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వాటికి పర్మినెంట్ నెంబర్లను కేటాయించారు. మొత్తం ఆరుకార్లలో ఒకటి మెర్సిడెజ్ బెంజ్ కాగా.. రెండు మహీంద్రా స్కార్పియోలు.. ఒక జీపు.. ఒక టయోటా వెల్ ఫేర్ కారుతో పాటు.. ఒక సరకు రవాణా వాహనం కూడా ఉన్నట్లుగా చెప్పారు. మొత్తం తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ వాహనాలు అత్యధికం ఏపీలోనూ వినియోగిస్తారని చెబుతున్నారు.

This post was last modified on December 23, 2022 12:06 pm

Share
Show comments

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

7 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

7 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

8 hours ago