ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన రాక సందర్భంగా కాస్తంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకూ పవన్ కల్యాణ్ ఆర్టీవో ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.
తాజాగా ఆయన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు అప్లికేషన్ పెట్టేందుకు ఆయన ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు.. తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఆయన ఆపీసుకు వచ్చారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వేళకు ఆయనకు స్లాట్ కేటాయించారు. చెప్పిన సమయానికి కాస్తంత ముందుగానే పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు చేరుకున్నారు.
నిజానికి ఉదయమే స్లాట్ ఇచ్చేందుకు రవాణా శాఖా అధికారులు సిద్ధమైనా.. తన కారణంగా ఆఫీసు పరిసరాల్లో ఇబ్బందికర వాతావరణం ఎదురు కాకుండా ఉండేందుకు నాన్ పీక్ సమయంలో వచ్చేందుకు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. కేటాయించిన సమయానికి కాస్తంత ముందుగానే వచ్చిన పవన్ కల్యాణ్.. రవాణా శాఖ ఉప కమిషనర్ పాపారావును కలిశారు.
ముందుగా బుక్ చేసుకున్న స్లాట్ లో.. ఆయనకు సంబంధించిన ఆరు వాహనాల్ని అర గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వాటికి పర్మినెంట్ నెంబర్లను కేటాయించారు. మొత్తం ఆరుకార్లలో ఒకటి మెర్సిడెజ్ బెంజ్ కాగా.. రెండు మహీంద్రా స్కార్పియోలు.. ఒక జీపు.. ఒక టయోటా వెల్ ఫేర్ కారుతో పాటు.. ఒక సరకు రవాణా వాహనం కూడా ఉన్నట్లుగా చెప్పారు. మొత్తం తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ వాహనాలు అత్యధికం ఏపీలోనూ వినియోగిస్తారని చెబుతున్నారు.
This post was last modified on December 23, 2022 12:06 pm
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…