Political News

నాయకుల్లేరు.. క్యాడర్ లేదు.. శంఖారావం సక్సెస్ ఎలా ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీనా? ఆ ప్రశ్నే ఒక పెద్ద జోక్. అలాంటి వేళలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోలేదన్న మాటనే నిజం చేసింది తాజాగా ఖమ్మంలో ముగిసిన శంఖారావం సభ. అలా అని.. ఈ సభకు వచ్చిన జనసందోహాన్ని చూసి.. తెలుగుదేశం పార్టీ గురించి అతిగా ఊహించుకుంటే అంతకు మించిన పిచ్చితనం మరొకటి ఉండదు. తాజాగా వచ్చిన జనసందోహాన్ని చూసినప్పుడు.. తెలుగుదేశం పార్టీకి సరైన నేతలు.. క్యాడర్లు లేదన్నది నిజమే అయినా.. ఆ పార్టీకి నేటికి అభిమానులు ఉన్నారన్న విషయాన్ని తాజా సభ స్పష్టం చేసిందని చెప్పాలి.

నిజానికి సభ ఏర్పాటు చేసిన వేళ.. జనం వస్తారా? లేదా? అన్న దానిపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. అన్నింటికి మించి సభ కానీ పేలవంగా జరిగితే.. దాని ప్రభావం పార్టీ మీద కంటే కూడా చంద్రబాబు ఛరిష్మా మీద పడుతుందన్న ఆందోళన ఉంది. అయితే.. అనూహ్యంగా అంచనాలకు మించి జనం రావటం.. జోష్ కనిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో కాసానికి మార్కులు వేయాల్సింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చంద్రబాబు కోసం మధ్యాహ్నం నుంచే పలు గ్రామాల్లో ప్రజలు ఎదురుచూడటం. ఇదంతా చూసినప్పుడు చంద్రబాబుకు ఇప్పటికి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ తగ్గలేదన్న విషయం స్పష్టమవుతుంది. సభకు వచ్చే వారి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన అంశం.. సభకు పెద్ద ఎత్తున యూత్ రావటం. ఇంతలా వస్తారన్న అంచనానే లేదు.

ప్రస్తుతం పార్టీలో పేరున్న నాయకులు లేరు. ద్వితీయశ్రేణి నేతలు లేరు. క్యాడర్ పోయి చాలాకాలమే అయ్యింది. అయినప్పటికీ ఇంత భారీగా సభకు హాజరు కావటం ఎలా? అదెలా సాధ్యమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయాన్ని తరచి చూస్తే అర్థమయ్యే విషయం ఏమంటే.. నాయకులు.. కార్యకర్తలు లేకున్నా.. తెలుగుదేశాన్ని అమితంగా ఆరాధించే అభిమానులే ఆ పార్టీ బలంగా మారిందని చెబుతున్నారు. ఇదే.. వారిని సభకు స్వచ్చందంగా వచ్చేలా చేసిందంటున్నారు. దీనికి తోడు.. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో.. టీడీపీ సత్తా చాటాలన్న కసి కూడా పెరిగిందని.. అదే టీడీపీ శంఖారావం సదస్సు సక్సెస్ కు మంత్రాగా మారిందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on December 22, 2022 2:48 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సందీప్ కిషన్ సినిమాలో ఫాదర్ ట్విస్టు

రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…

5 hours ago

మహాసేన రాజేష్.. మళ్లీ యుటర్న్

మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…

6 hours ago

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…

6 hours ago

నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త…

6 hours ago

అంబటికి మళ్లీ అల్లుడి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…

6 hours ago

ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అవసరమంటారా

ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…

9 hours ago