ఒకవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ జన్మదిన వేడుకలు..మరోవైపు వైసీపీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, ఆధిపత్య ధోరణి తదితర అనేక అంశాలు రచ్చ రచ్చ సృష్టించాయి. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ నేతలు ఎంత మంది కలివిడిగా ఉన్నారు.? ఎంత మంది దూరంగా ఉన్నారు? అనే విషయాలు ఈ వేడుకల సాక్షిగా బయటకు వచ్చాయి. నువ్వా నేనా అనే సంస్కృతికి పార్టీ కడు దూరమని.. అందరూ కలివిడిగా ఉంటారని ఒక పేరుంది.
అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం అంతర్గత కుమ్ములాటలకు వైసీపీ మాత్రం అతీతం కాదని నిరూపించినట్టు అయింది. శ్రీకాకుళంలో స్పీకర్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావులు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపించారు. విజయనగరంలో పార్టీ కీలక నాయకురాలుగా జగన్ కొన్ని రోజుల కిందటే పేర్కొన్న కిల్లి కృపారాణి నిర్వహించిన కార్యక్రమానికి మిగిలిన నాయకులు డుమ్మా కొట్టారు.
విజయవాడలో మల్లాది విష్ణు పాల్గొన్న కార్యక్రమానికి ఇతర నేతలు డుమ్మా కొట్టారు. ఇతర నేతల కార్యక్ర మాలకు మల్లాది కూడా గైర్హాజరయ్యారు. తిరుపతిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కీలకమైన మాచర్లలో అసలు సందడే కనిపించలేదు. ఇటీవలే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదం నడిచిన విషయం తెలిసిందే. అలాంటి చోట వైసీపీ అధినేత జన్మదిన వేడుకల ఊపు పెద్దగా కనిపించలేదు.
ఇక, హిందూపురంలో ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా ఇక్కడ మూడు వర్గాలు ముచ్చటగా.. పక్క పక్కనే పందిళ్లు వేసి మరీ కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ, ఏంలాభం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ కేంద్రంగా విమర్శలు.. వివాదాలతోనే సరిపోయింది. మొత్తంగా చూస్తే.. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. నాయకుల బలాబలాలు నిరూపించుకునేందుకు, ఆధిపత్య ధోరణి ప్రదర్శించేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.
This post was last modified on December 22, 2022 2:01 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…