Political News

వేడుక‌ల వేళ వైసీపీలో ర‌చ్చ ర‌చ్చ‌!!

ఒక‌వైపు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు..మ‌రోవైపు వైసీపీ నేత‌ల్లో నెల‌కొన్న అసంతృప్తి, ఆధిప‌త్య ధోర‌ణి త‌దిత‌ర అనేక అంశాలు ర‌చ్చ ర‌చ్చ సృష్టించాయి. హిందూపురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు వైసీపీ నేత‌లు ఎంత మంది క‌లివిడిగా ఉన్నారు.? ఎంత మంది దూరంగా ఉన్నారు? అనే విష‌యాలు ఈ వేడుక‌ల సాక్షిగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నువ్వా నేనా అనే సంస్కృతికి పార్టీ క‌డు దూర‌మ‌ని.. అంద‌రూ క‌లివిడిగా ఉంటార‌ని ఒక పేరుంది.

అయితే, తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు మాత్రం అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు వైసీపీ మాత్రం అతీతం కాద‌ని నిరూపించిన‌ట్టు అయింది. శ్రీకాకుళంలో స్పీక‌ర్‌, మంత్రులు సీదిరి అప్ప‌ల‌రాజు, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావులు ఎవ‌రికి వారే కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి మ‌మ అనిపించారు. విజ‌య‌న‌గ‌రంలో పార్టీ కీల‌క నాయ‌కురాలుగా జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌టే పేర్కొన్న కిల్లి కృపారాణి నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి మిగిలిన నాయ‌కులు డుమ్మా కొట్టారు.

విజ‌య‌వాడ‌లో మ‌ల్లాది విష్ణు పాల్గొన్న కార్య‌క్ర‌మానికి ఇత‌ర నేత‌లు డుమ్మా కొట్టారు. ఇత‌ర నేత‌ల కార్య‌క్ర మాల‌కు మల్లాది కూడా గైర్హాజ‌ర‌య్యారు. తిరుప‌తిలోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. కీల‌క‌మైన మాచ‌ర్ల‌లో అస‌లు సంద‌డే క‌నిపించ‌లేదు. ఇటీవ‌లే ఇక్క‌డ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ వివాదం న‌డిచిన విష‌యం తెలిసిందే. అలాంటి చోట వైసీపీ అధినేత జ‌న్మ‌దిన వేడుక‌ల ఊపు పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

ఇక‌, హిందూపురంలో ఎవ‌రికివారే య‌మునా తీరే అన్న‌ట్టుగా ఇక్క‌డ మూడు వ‌ర్గాలు ముచ్చ‌ట‌గా.. ప‌క్క ప‌క్కనే పందిళ్లు వేసి మ‌రీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. కానీ, ఏంలాభం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ కేంద్రంగా విమ‌ర్శ‌లు.. వివాదాల‌తోనే స‌రిపోయింది. మొత్తంగా చూస్తే.. సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లు.. నాయ‌కుల బ‌లాబలాలు నిరూపించుకునేందుకు, ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శించేందుకు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మనార్హం.

This post was last modified on December 22, 2022 2:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

54 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago