Political News

క్రైస్తవం లేకపోతే ఇండియాకు మార్గమే లేదు – హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ అంటే.. రాష్ట్రం మొత్తం వైద్య శాఖ‌కు మంత్రి త‌ర్వాత మంత్రి లెక్క క‌దా! కానీ, ఈయ‌న ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో త‌ల‌దూరుస్తున్నాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. చ‌ర్య‌ల‌తో ఆయ‌న త‌ర‌చుగా మీడియాలోనూ క‌నిపిస్తున్నారు. తాజాగా ఆయ‌న క‌రోనా మ‌హ‌మ్మారిపై చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేశాయి. ప్ర‌పంచం నుంచి క‌రోనా పోయిందంటే.. అది ఏసు ప్ర‌భువు ద‌య‌వ‌ల్లేన‌ని ఆయ‌న ఏమాత్రం త‌డుముకోకుండా చెప్పారు. అంతేకాదు, క్రైస్తవం లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాగించలేకపోయేదన్నారు.

క్రైస్తవం ద్వారా ఆనాడు ఆధునిక విద్య, వైద్యం తీసుకురాక పోయి ఉంటే… దేశం అభివృద్ధి చెంది ఉండేది కాదని సెల‌విచ్చారు. దీంతో నెటిజ‌న్లు ఒక్క‌సారిగా రియాక్ట్ అయ్యారు. దేశంలో వ్యాక్సిన్లు, మాస్కులు.. ఎందుకు వినియోగించారో సార్‌కే తెలియాల‌ని నెటిజ‌న్లు ఎదురు దాడి చేశారు.

ఉమ్మ‌డి ఖ‌మ్మం కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎన్‌ఆర్ ట్రస్ట్ పేరుతో నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులు.. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రిలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వ‌హించారు. దీనికి రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. అంతటితో ఆగని ఆయన దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని తెలిపారు. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

ఇదిలావుంటే, అస‌లు శ్రీనివాస్ ఇటీవ‌ల కాలంలో ఏదో ఓ వివాదంలో క‌నిపిస్తూ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆ మధ్య ఖమ్మంలో శ్రీనివాస్‌ క్షుద్రపూజలు చేశారనే వాద‌న బ‌లంగా వినిపించింది. దేవుడు కరుణిస్తాడంటూ విచిత్ర పూజలు నిర్వహించిన వీడియోలుకూడా వైర‌ల్ అయ్యాయి. దేవతనని ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే విషయం బయటకు రావడంతో శ్రీనివాస్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల రాష్ట్రంలో ఒకే రోజు 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీనివాస్ నిమిషం వ్యవధిలోనే రెండు సార్లు కేసీఆర్ కాళ్లు మొక్కారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసమే శ్రీనివాస్ ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి.

This post was last modified on December 22, 2022 6:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

54 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

1 hour ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

1 hour ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago