Political News

కేసీఆర్ ఈసారి ప్రెస్ మీట్ పెట్ట‌లేదు కానీ..

క‌రోనా ప్ర‌భావం ఓ మోస్త‌రు స్థాయిలో ఉన్న‌పుడు వారం ప‌ది రోజుల‌కు ఒక ప్రెస్ మీట్ పెట్టి జ‌నాల్లో ధైర్యం నింపేవారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అప్ప‌ట్లో ఆయ‌న వివిధ శాఖ‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ ఉండేవారు కూడా. కానీ ఈ మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయికి చేరి తెలంగాణ‌ను వ‌ణికిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న అందుబాటులో లేక‌పోవ‌డం, ప్రెస్ మీట్ ఊసే లేక‌పోవ‌డం, అస‌లు అధికారుల‌తో కూడా ట‌చ్‌లో లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రీఎంట్రీ కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఆయ‌న మ‌ళ్లీ ప్రెస్ మీట్ పెడ‌తార‌ని.. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై అప్ డేట్లు ఇస్తార‌ని.. జ‌నాల్లో ధైర్యం నింపుతార‌ని.. అలాగే విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం కూడా చెబుతార‌ని అంతా అనుకున్నారు.

ఐతే కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు కానీ.. మీడియా ముందుకు మాత్రం రాలేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆయ‌న ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మీడియా ద్వారా అంద‌రికీ దిశానిర్దేశం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుని వాటి గురించి వెల్ల‌డించారు. రాష్ట్రంలో మొత్తంగా 41,018 మందికి వైరస్ సోకిందని.. 27,295 మంది కోలుకుని (67%) ఇంటికి వెళ్లిపోయారని… ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా వేగంగా కోలుకుంటున్నారని.. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వీరందరికీ తగిన సూచనలు, చికిత్స అందిస్తున్నామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

గాంధీ, టిమ్స్ లలోనే దాదాపు 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి 5 వేలు ఉన్నాయ‌ని… 1500 వెంటిలేటర్లు సిద్దంగా పెట్టామ‌ని..అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించామని కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలుచేయడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని, పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు.

ప్రైవేటు ఆసుప‌త్రుల దందాపై అనేక ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో వారికి కేసీఆర్ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంద‌ని… ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలని అన్నారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అదే సందర్భంలో నిర్లక్ష్యం కూడా వద్ద‌ని.. కరోనా సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని.. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉన్నాయ‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

This post was last modified on July 18, 2020 12:31 am

Share
Show comments
Published by
suman

Recent Posts

మార్కో అంద‌రినీ చెడగొట్టేసాడా?

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి…

15 minutes ago

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

5 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

11 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

14 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

16 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

17 hours ago