Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ, రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాల్లో సాగింది. దాదాపు 2,800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ కు అదనంగా లభించిన ఫలితం ఏంటి? రాహుల్కు దక్కిన ఇమేజ్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల దూరం సాగేలా ప్లాన్ చేసుకుని సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో పూర్తి చేసుకుంది. మధ్య మధ్య చిన్నపాటి విరామ చిహ్నాలే తప్ప.. మొత్తంగా చూస్తే..ఏకధాటిగా ఇప్పటివరకు 2800కిలో మీటర్లు ఈ యాత్ర సాగింది.
అయితే, ఈ యాత్ర ద్వారా రాహుల్ తన మద్దతుదారులతోపాటు వ్యతిరేకులను కూడా ఆకట్టుకున్నారనే ది కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట. మరోవైపు ఈ యాత్రలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారని కూడా అంటున్నారు. అయితే.. లెక్క ఎంత ఎక్కువగా ఉందనేది పక్కన పెడితే.. ఇతమిత్థంగా ఈ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ సాధించింది ఏంటి? అనేది చూస్తే.. ఒకింత ఇబ్బంది తప్పదు.
ఎందుకంటే.. కీలకమైన గుజరాత్ ఎన్నికలు సహా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే జరిగాయి. అయితే, వీటిలో ఒక్క హిమాచల్ మినహా మిగిలిన చోట కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ గెలుపు కూడా సంప్రదాయంగా అందిన విజయమేనని పరిశీలకులు చెబుతున్నారు. పోనీ భారీ గెలుపు అందామా? అంటే.. బొటా బొటీ స్థానాలే దక్కాయి.
ఇక, గుజరాత్లో అయితే.. 77 సీట్ల నుంచి 20కి జారిపోయిన పరిస్థితి, ఢిల్లీ కార్పొరేషన్లో మరింత దారుణం.. అంటే.. భారత్ జోడో యాత్ర ద్వారా కొల్లగొట్టిన ఓట్లు పెద్దగా లేవనే చెప్పాలి. అయినప్పటికీ.. దీనిని కాంగ్రెస్ నాయకులు విజయయాత్రగానే భావిస్తున్నారు. నిజానికి ఒక యాత్ర లక్ష్యం.. ఎన్నికల్లో విజయమే. దీనిని కాదని.. ఎవరూ అనలేరు. అలా చూసుకుంటే జోడో యాత్ర మొత్తం సఫలమా? విఫలమా? అంటే.. ఇప్పటికైతే.. సాగుతోందనే చెప్పాలి.
This post was last modified on December 16, 2022 9:12 pm
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…