ఏపీ రాజధాని అమరావతి రైతులు మరో యాత్రకు రెడీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ.. ఇప్పటికే రెండు సార్లు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి(ఇది మధ్యలోనే ఆగింది) వరకు పాదయాత్ర చేసిన రైతులు.. ఇప్పుడు తాజాగా.. ఈనెల 17, 18, 19 తేదీల్లో ఢిల్లీ వేదికగా తమ గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు.
‘ధరణికోట నుంచి ఎర్రకోట’ వరకూ నినాదంతో నిరసన యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. దాదాపు 1800 మంది రైతులతో ప్రత్యేక రైలులో దేశ రాజధానికి వెళ్లనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా ధరణి కోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.
అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసినా.. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని రాజధాని రైతు నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరి షర్మిల అరెస్టుపై స్పందించిన ప్రధాని, స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రధాని మద్దతుతోనే వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం జగన్ మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఇదీ.. షెడ్యూల్
This post was last modified on December 14, 2022 6:34 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…