Political News

దేశ రాజ‌ధానికి ‘ఏపీ రాజ‌ధాని’ సెగ.. రైతుల మ‌రో యాత్ర‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు మ‌రో యాత్ర‌కు రెడీ అయ్యారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిగానే ఉంచాల‌ని డిమాండ్ చేస్తూ.. ఇప్ప‌టికే రెండు సార్లు న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు, అమ‌రావ‌తి నుంచి అర‌స‌వల్లి(ఇది మ‌ధ్య‌లోనే ఆగింది) వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన రైతులు.. ఇప్పుడు తాజాగా.. ఈనెల‌ 17, 18, 19 తేదీల్లో ఢిల్లీ వేదికగా త‌మ గ‌ళం వినిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు.

‘ధరణికోట నుంచి ఎర్రకోట’ వరకూ నినాదంతో నిరసన యాత్ర చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. దాదాపు 1800 మంది రైతుల‌తో ప్రత్యేక రైలులో దేశ‌ రాజధానికి వెళ్ల‌నున్న‌ట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా ధరణి కోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్ర చేపట్టాలని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు.

అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసినా.. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని రాజ‌ధాని రైతు నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరి ష‌ర్మిల అరెస్టుపై స్పందించిన ప్రధాని, స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రధాని మద్దతుతోనే వైసీపీ ప్ర‌భుత్వం, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ మూడు రాజధానుల నాటకం ఆడుతున్నార‌ని నిప్పులు చెరిగారు.

ఇదీ.. షెడ్యూల్

  • 15వ తేదీ రాత్రికి విజయవాడ నుంచి బయలుదేరి 16వ తేదీ రాత్రికి దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకుంటారు.
  • డిసెంబర్ 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద అమ‌రావ‌తికి అనుకూలంగా నిర‌స‌న చేప‌ట్ట‌నున్నారు.
  • డిసెంబ‌రు 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి అమరావతి గోడు వినిపించనున్నారు.
  • 19వ తేదీన రాంలీల్ మైదానంలో జరిగే ‘కిసాన్ సంఘ్’ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొంటారు.
  • 21వ తేదీన తిరిగి విజయవాడ చేరుకుంటారు.

This post was last modified on December 14, 2022 6:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago