Political News

దేశ రాజ‌ధానికి ‘ఏపీ రాజ‌ధాని’ సెగ.. రైతుల మ‌రో యాత్ర‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు మ‌రో యాత్ర‌కు రెడీ అయ్యారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిగానే ఉంచాల‌ని డిమాండ్ చేస్తూ.. ఇప్ప‌టికే రెండు సార్లు న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు, అమ‌రావ‌తి నుంచి అర‌స‌వల్లి(ఇది మ‌ధ్య‌లోనే ఆగింది) వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన రైతులు.. ఇప్పుడు తాజాగా.. ఈనెల‌ 17, 18, 19 తేదీల్లో ఢిల్లీ వేదికగా త‌మ గ‌ళం వినిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు.

‘ధరణికోట నుంచి ఎర్రకోట’ వరకూ నినాదంతో నిరసన యాత్ర చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. దాదాపు 1800 మంది రైతుల‌తో ప్రత్యేక రైలులో దేశ‌ రాజధానికి వెళ్ల‌నున్న‌ట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా ధరణి కోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్ర చేపట్టాలని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు.

అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు స్పష్టం చేసినా.. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని రాజ‌ధాని రైతు నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి సోదరి ష‌ర్మిల అరెస్టుపై స్పందించిన ప్రధాని, స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రధాని మద్దతుతోనే వైసీపీ ప్ర‌భుత్వం, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ మూడు రాజధానుల నాటకం ఆడుతున్నార‌ని నిప్పులు చెరిగారు.

ఇదీ.. షెడ్యూల్

  • 15వ తేదీ రాత్రికి విజయవాడ నుంచి బయలుదేరి 16వ తేదీ రాత్రికి దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకుంటారు.
  • డిసెంబర్ 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద అమ‌రావ‌తికి అనుకూలంగా నిర‌స‌న చేప‌ట్ట‌నున్నారు.
  • డిసెంబ‌రు 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి అమరావతి గోడు వినిపించనున్నారు.
  • 19వ తేదీన రాంలీల్ మైదానంలో జరిగే ‘కిసాన్ సంఘ్’ కార్యక్రమంలో అమరావతి రైతులు పాల్గొంటారు.
  • 21వ తేదీన తిరిగి విజయవాడ చేరుకుంటారు.

This post was last modified on December 14, 2022 6:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago