Political News

ఢిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీల‌ను తొల‌గించేశారు!

భార‌త రాష్ట్ర‌స‌మితి పేరుతో జాతీయ స్థాయిలో గ‌ళం వినిపించి.. ప్ర‌ధాని మోడీకి చుక్క‌లు చూపించాల‌ని అనుకున్న సీఎం కేసీఆర్‌.. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో బీఆర్ ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ప్రారంభించా రు. అత్యంత అట్ట‌హాసంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ప‌లువురు కీల‌క రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, మాజీ ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఢిల్లీలోని ప్ర‌ధాన మార్గాల్లో కేసీఆర్ చిత్రంతో కూడిన భారీ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారు. వీటిపై.. దేశ నేత‌ రైతుల ఆశాజ్యోతి కేసీఆర్ జ‌య‌హో నినాదాల‌ను ఇంగ్లీషు, హిందీల్లో ముద్రించారు. వీటిని ఢిల్లీ విమానాశ్ర‌యం నుంచి నూత‌న భ‌వ‌నం వ‌ర‌కు.. ర‌హ‌దారికి రెండు వైపుల పెద్ద ఎత్తున క‌ట్టారు. అయితే.. వీటిని తెల్లారి చూసే స‌రికి క‌నిపించ‌క‌పోవ‌డం గమ‌నార్హం.

ముఖ్యంగా స‌ర్దార్ ప‌టేల్ మార్గంలో అయితే.. గులాబీ జెండాలు భారీ ఎత్తున వెలిశాయి. అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీల‌ను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు మాత్రం తెల్ల‌వారుజామునే వీటిని తొల‌గించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌.. సీఎం కేజ్రీవాల్ అధీనంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జ‌ర‌గ‌డం.. చ‌ర్చ‌నీయాంశం అయింది.

అయితే.. స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో అనేక మంది వీవీఐలు తిరుగుతూ ఉంటార‌ని.. వారికి ఇబ్బంది క‌లిగించ కూడ‌ద‌నే ఏకైక ఉద్దేశంతోనే తాము ఫ్లెక్సీల‌ను తొల‌గించామ‌ని.. ఢిల్లీ కార్పొరేష‌న్ అధికారులు తెలిపారు. ఇక‌, దీనిపై బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

This post was last modified on December 13, 2022 7:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago