భారత రాష్ట్రసమితి పేరుతో జాతీయ స్థాయిలో గళం వినిపించి.. ప్రధాని మోడీకి చుక్కలు చూపించాలని అనుకున్న సీఎం కేసీఆర్.. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించా రు. అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి పలువురు కీలక రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
అయితే.. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీలోని ప్రధాన మార్గాల్లో కేసీఆర్ చిత్రంతో కూడిన భారీ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారు. వీటిపై.. దేశ నేత రైతుల ఆశాజ్యోతి కేసీఆర్ జయహో నినాదాలను ఇంగ్లీషు, హిందీల్లో ముద్రించారు. వీటిని ఢిల్లీ విమానాశ్రయం నుంచి నూతన భవనం వరకు.. రహదారికి రెండు వైపుల పెద్ద ఎత్తున కట్టారు. అయితే.. వీటిని తెల్లారి చూసే సరికి కనిపించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా సర్దార్ పటేల్ మార్గంలో అయితే.. గులాబీ జెండాలు భారీ ఎత్తున వెలిశాయి. అదేసమయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం తెల్లవారుజామునే వీటిని తొలగించడం గమనార్హం. నిజానికి కేసీఆర్కు మద్దతుగా నిలిచిన.. సీఎం కేజ్రీవాల్ అధీనంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం.. చర్చనీయాంశం అయింది.
అయితే.. సర్దార్ పటేల్ మార్గ్లో అనేక మంది వీవీఐలు తిరుగుతూ ఉంటారని.. వారికి ఇబ్బంది కలిగించ కూడదనే ఏకైక ఉద్దేశంతోనే తాము ఫ్లెక్సీలను తొలగించామని.. ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇక, దీనిపై బీఆర్ ఎస్ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
This post was last modified on December 13, 2022 7:22 pm
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…
వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…