భారత రాష్ట్రసమితి పేరుతో జాతీయ స్థాయిలో గళం వినిపించి.. ప్రధాని మోడీకి చుక్కలు చూపించాలని అనుకున్న సీఎం కేసీఆర్.. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించా రు. అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి పలువురు కీలక రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
అయితే.. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీలోని ప్రధాన మార్గాల్లో కేసీఆర్ చిత్రంతో కూడిన భారీ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారు. వీటిపై.. దేశ నేత రైతుల ఆశాజ్యోతి కేసీఆర్ జయహో నినాదాలను ఇంగ్లీషు, హిందీల్లో ముద్రించారు. వీటిని ఢిల్లీ విమానాశ్రయం నుంచి నూతన భవనం వరకు.. రహదారికి రెండు వైపుల పెద్ద ఎత్తున కట్టారు. అయితే.. వీటిని తెల్లారి చూసే సరికి కనిపించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా సర్దార్ పటేల్ మార్గంలో అయితే.. గులాబీ జెండాలు భారీ ఎత్తున వెలిశాయి. అదేసమయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం తెల్లవారుజామునే వీటిని తొలగించడం గమనార్హం. నిజానికి కేసీఆర్కు మద్దతుగా నిలిచిన.. సీఎం కేజ్రీవాల్ అధీనంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జరగడం.. చర్చనీయాంశం అయింది.
అయితే.. సర్దార్ పటేల్ మార్గ్లో అనేక మంది వీవీఐలు తిరుగుతూ ఉంటారని.. వారికి ఇబ్బంది కలిగించ కూడదనే ఏకైక ఉద్దేశంతోనే తాము ఫ్లెక్సీలను తొలగించామని.. ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇక, దీనిపై బీఆర్ ఎస్ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
This post was last modified on December 13, 2022 7:22 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…