జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే 2024 ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఉపయోగించాలని నిర్ణయించిన ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. వారాహి వాహనాన్ని రోడ్డు రవాణా చట్టం ప్రకారం అన్నినిబంధనలు పాటించారని, దీనిని ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారు.
అయితే, ఈ వాహనంపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ‘వారాహి’ కలర్ ఆలివ్ గ్రీన్ అని.. ఇది సైనికులు వినియోగించే వాహనాలకు మాత్రమే వాడతారని, కాబట్టి ఈ వాహనం రిజిస్ట్రేషన్ కాదని.. పవన్ ఇంకా నేర్చుకోవాలని.. ఇలా కామెంట్లు చేశారు.
అయితే, ఈనిపై తెలంగాణ ఆర్టీయే అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు వాహనం ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని, ఈ వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని, ఆలివ్ గ్రీన్ కాదని అధికారులు వివరించారు.
తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో వారాహి ప్రచార రథం ఇక, రోడ్డెక్కనుంది. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ జనసేన నేతలు ప్రకటించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టిన విషయం తెలిసిందే. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయని జనసేన నాయకులు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో త్వరలోనే ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, ఏపీలోకి తీసుకురానున్నట్టు నాయకులు తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ వాహనాన్ని ఉంచేందుకు ప్రత్యేక షెడ్డును , భద్రతను కూడా కల్పించారు
This post was last modified on December 12, 2022 6:41 pm
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…
ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి…
మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…
ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాతతరానికి చెందిన నాయకులు.. ఒక కులాన్ని ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా…
మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు…