ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాతృమూర్తి వైఎస్ విజయమ్మను తెలంగాణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలోనే పోలీసులు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మంగళవారం ఉదయం వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. ప్రగతి భవన్వైపు తనే కారు నడుపుతూ వచ్చిన క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం షర్మిలను ఎస్ ఆర్. నగర్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో తన కుమార్తెను పరా మర్శించి, మద్దతు తెలిపేందుకు ఆమె మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా ప్రత్యేక కారులో ఇంటి నుం చి బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన విజయమ్మ ఇంటికి చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. నేరుగా కారు వద్దకే వెళ్లి.. ఆమెను ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కారు దిగిన విజయమ్మ కొద్ది దూరం పరిగెత్తే ప్రయత్నం చేసి.. పోలీసులను తప్పించుకో వాలని అనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఎంతసేపటికీ కాలుకదపకుండా చేయడంతో విజయమ్మ ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. మేమూ ప్రభుత్వాలు నడిపాం. మాకు అన్నీ తెలుసు. పోలీసుల మొహం నేను చూడనట్టే వ్యవహరిస్తున్నారే అంటూ విజయమ్మ వ్యాఖ్యానించారు.
తనను అడ్డుకుంటే అక్కడే కూర్చుని ఆందోళన చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపి.. ధర్నాలు చేయమంటారా? నిరసనలకు పిలుపునివ్వమంటారా? రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వనా? మైకులు తెప్పించి మాట్లాడనా? అని ప్రశ్నించా
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…