Political News

ఆ మంత్రికి టికెట్ ఇవ్వొద్దు.. వైసీపీలో ముస‌లం

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఏడాదిన్నర స‌మ‌యం ఉండ‌గానే అధికార పార్టీలో అస‌మ్మ‌తి రాజుకుంది. సిట్టింగు ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మంత్రుల విష‌యంలో ప‌లు చోట్ల వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా శ్రీకాకులం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. రానున్న ఎన్నికల్లో అప్పలరాజుకు టికెట్ ప్రకటిస్తే తప్పకుండా ఓడిస్తామని అసమ్మతి నాయకులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు తీర ప్రాంతంలోని వనభోజన మహోత్సవంలో పలువురు వైసీపీ అసమ్మతి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరి మాట్లాడుతూ.. ‘మీము వైసీపీ నేతలం. సీదిరిపై అసమ్మతి నాయకులం మాత్రమే. పలాస నియోజకవర్గంలో మంత్రి అండదండలతో జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను సీఎం జగ‌న్ దృష్టికి పూర్తి ఆధారాలతో తీసుకెళ్తాం. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లుగా ఉన్న‌ అగ్నికుల క్షత్రియ, యాదవ, కాళింగ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిని ప్రకటించాలని కోరుతాం. దీన్ని పూర్తిస్థాయి ఓటర్ల జాబితాతో సహా అన్ని వివరాలతో సీఎం దృష్టికి తీ సుకెళ్తాం“ అన్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్యర్థిని మార్చకపోతే పలాసలో వైసీపీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. పార్టీ ప్రతిష్ట దిగజారి, మనుగుడ కోల్పోతామ‌న్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండువర్గాలుగా విడగొట్టి శకుని రాజకీయాలకు పాల్పడుతున్నారు. కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులతో దోపిడీలు, అక్రమాలు చేయిస్తూ తమకేమీ తెలియనట్లుగా మంత్రి వ్యవహరిస్తున్నారు. దీన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్ని కల్లో సీదిరి అభ్యర్థిగా పోటీచేస్తే వైసీపీ నుంచి 175 స్థానాలకు గాను 174 స్థానాలే లెక్కించాలి. ఈ జాబితా నుంచి పలాసను తీసివేయాలి అని నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

పార్టీ కష్టాల్లో ఉన్న సమయంతోపాటు గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేసిన సీనియర్ నాయకులను పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీలోని నాయకులను మంత్రి చేరదీసి తమ ఆక్రమాలకు అడ్డులేకుండా చేసుకున్నారని మంత్రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో పార్టీ ప్రతిష్ట మంటగలిసింద‌న్నారు. `ప్రతి పనికి ఒక రేటులా మంత్రి కోటరీ మారింది’ అని విమర్శించారు. మంత్రి అక్రమాలు, అన్యాయాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘గడపగడపకు మన ప్రభుత్వం చప్పగా సాగుతోందని మంత్రి తీరుతో పార్టీ భ్రష్టు పట్టిపోయింద ని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సుమారు 300 మంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Satya

Recent Posts

తెలంగాణలో జనసేన సింగిల్ గా గర్జిస్తుందా?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…

4 hours ago

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

8 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

11 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

13 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

14 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

14 hours ago