వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం నుంచి అనేక ఫ్యాక్టరీలు వైసీపీ ప్రభుత్వ దెబ్బతో పొరుగు రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు కట్ డ్రాయర్లు తయారు చేసే జాకీ సంస్థ కూడా ఇక్కడి వైసీపీ నేతలకు లంచాలు, ముడుపులు ఇచ్చుకోలేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. ఇది మీకు సిగ్గని పించడం లేదా? అని సీఎం జగన్ను సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాల కిందట అధికారం చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీని కూడా తీసుకురాలేదు. నెల్లూరుకు వచ్చిన ఒక సంస్థ వెళ్లిపోయింది. విశాఖలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు కూడా సుదూర దేశాల నుంచివచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనుకున్నవికూడా వెళ్లిపోయాయి. ఇదేనా మీ సంక్షేమ రాజ్యం. ఇలా అయితే, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి.? ఇక్కడి యువత నిరుద్యోగంతో మగ్గిపోవాల్సిందేనా? అని పవన్ నిలదీశారు.
అహంకార ధోరణితో పాలిస్తున్నారన్న తన మాటలను వక్రీకరిస్తున్నారని, అహం కారం అంటే.. మేమే అధికారంలో ఉండాలి. మీరు మేం ఇస్తే తినేవాళ్లు.. మేం విసిరేసే ఎంగిలి మెతుకులు ఏరుకునేవారుగా మారడమేనని, ఇదే జనసేన వ్యతిరేకిస్తోందని పవన్ చెప్పారు. 30 సంవత్సరాలు.. అధికారంలోకి ఉండాలని మీరు అనుకుంటున్నారు. కానీ, అదే 30 సంవత్సరాల్లో యువత బాగుపడాలని, వారి జీవితాలు ఉజ్వలంగా ఉండాలని జనసేన కోరుకుంటోందని అన్నారు.
ఇదే.. వైసీపీకి, జనసేనకు మధ్య తేడా అని పవన్ చెప్పుకొచ్చారు. రెండుకళ్లు లేని ఒక వ్యక్తి మనకేదో కంప్లయింట్ ఇచ్చారని.. వారిని బెదిరించడం.. అహంకారం, సీమ ప్రాంతం నుంచి జనసేన సభకు వచ్చిన వారిని బెదిరించడమే అహంకారం.. కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితే అహంకారం. మీ ఉడత ఊపులకు జనసేన భయపడదు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ చెప్పారు. మాకు మద్దతుగా ఉన్న గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడితే.. 2024లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే లీగల్ విధానం ద్వారా.. మీ ఎమ్మెల్యేలను అప్పటికి ఎక్స్ ఎమ్మెల్యేలు అయిపోతారు కదా.. వాళ్లను తరిమి తరిమి కొడతాం.. అని హెచ్చరించారు.
This post was last modified on November 27, 2022 3:11 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…