Political News

ఆయన్ను పిలిపించుకొని మాట్లాడిన జగన్.. అసలేం జరిగింది?

ఒక్కో ముఖ్యమంత్రి తీరు ఒక్కోలా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎవరికి సంబంధించిన వార్త పబ్లిష్ అయ్యాక.. అలాంటి వారిని ముఖ్యమంత్రులు పక్కన పెట్టేయటం సాధారణంగా జరుగుతుంది. అందులోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వారైతే.. ఇక వారివైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడరని చెబుతారు. అలాంటి తీరుకు భిన్నమైన అంశం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఏరి కోరి తెచ్చుకొని సీఎంవోలో పెట్టుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ కు సంబంధించిన అంశం ఇటీవల ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

తాను కోరి తెచ్చుకున్న ముగ్గురు రిటైర్డు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కేటాయించిన సబ్జెక్టులను ఆకస్మికంగా తొలగించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎందుకిలా చేశారన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఇదే సమయంలో సబ్జెక్టులు తొలగించిన ముగ్గురు అధికారుల్లో అజయ్ కల్లంకు మాత్రం ఫైళ్లు యథావిధిగా వెళ్లటం మిగిలిన ఇద్దరికి ఎలాంటి ఫైళ్లు వెళ్లని వైనంపై వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి.

కోరి తెచ్చుకున్న అధికారులకు ఇలా జరగటం ఏమిటి? అన్న ప్రశ్న వ్యక్తమైంది. దీనికి తోడు పీవీ రమేశ్ దళిత నేపథ్యం ఉన్న అధికారి కావటం.. ముక్కుసూటితనం ఎక్కువ కావటం కూడా మీడియాలో వార్తలుగా వచ్చాయి. ఇలాంటివేళ.. తాజాగా ముఖ్యమంత్రి జగన్.. పీవీ రమేశ్ తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వార్తలు వచ్చిన వారిని కలవటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుసుకునేందుకు అస్సలు ఇష్టపడరన్న మాట తరచూవినిపిస్తూ ఉంటుంది. అందుకుభిన్నంగా తనకు తానే పీవీ రమేశ్ ను సీఎంను పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.

తమ సమావేశంలో భాగంగా గతంలో ఆయన చూసిన సబ్జెక్టుల్ని యథావిధిగా చూడాలని కోరారని చెబుతున్నారు. జరిగిన విషయాల్ని పట్టించుకోవద్దని.. తన వరకు రాకుండానే జరిగినట్లుగా సీఎం జగన్ చెప్పినట్లు తెలిసింది. మనసులో ఏమీ పెట్టుకోకుండా గతంలో మాదిరి పని చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి పీవీ రమేశ్ ఓకే చెప్పారంటున్నారు. ఏమైనా.. తాజా ఉదంతం మాత్రం రోటీన్ కు భిన్నమంటున్నారు.

This post was last modified on July 15, 2020 2:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: IASJagan

Recent Posts

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

3 hours ago

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…

3 hours ago

స్పెషల్ సాంగ్ కోసం ‘పెద్ది’ తిప్పలు

ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్,…

6 hours ago

రాజా సాబ్ పొరపాటు చేయొద్దు ఉస్తాద్

నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా…

6 hours ago

మధ్య వయసులో ‘విశ్వనాథ్’ ఆడే ప్రేమాట

గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు…

7 hours ago

శ్రీలీల, మహేష్ మధ్య ఏం జరిగింది?

నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…

7 hours ago