ఏపీ సీఎం జగన్.. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే.. వారిపై చాలా భరోసా పెట్టుకుంటారనే పేరుంది. వారికి కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ఇలా.. అనేక మందిని ఆయన నమ్మిన బంట్లుగా పెట్టుకున్నారు. ఇది 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి బాగా కలిసి వచ్చేలా చేసింది. అయితే, చిత్రంగా ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. కారణాలు ఏవైనా.. కూడా నాయకులు విశ్వాసాన్ని కోల్పోతున్నారు.
దీంతో నియోజకవర్గ స్థాయిలో ఇంచార్జులను మార్చేస్తూ.. తాజాగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం.. వైసీపీలో ఆసక్తిగా మారింది. దీనిని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు నొచ్చుకుంటున్నారు. కర్నూలు లో ఇటీవల.. చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీపైనా.. ఎమ్మెల్యేలు, సీఎంపైనా తీవ్రస్థా యిలో విరుచుకుపడ్డారు. ఇక, జనసమీకరణ కూడా బాగానే చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ బాధ్యతలు చూస్తున్న వైసీపీ నాయకులు స్పందించలేదు.
ముఖ్యంగా ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు.. సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డిలు.. చంద్రబాబుపై పన్నెత్తు మాట కూడా అనలేదు. దీంతో వైసీపీఅధిష్టానం డిఫెన్స్లో పడింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందోని ఆరా తీసింది. నియోజకవర్గం స్థాయిలో వైసీపీ బాధ్యతలను సీఎం జగన్ అత్యంత నమ్మకస్తులైన వారికి మాత్రమే అప్పగించారు. అలాంటి వారు కూడా ఇప్పుడు విఫలమవుతుండడం.. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేయడం .. కలవరపరుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే మార్పు దిశగా వైసీపీ అధినేత అడుగులు వేస్తున్నారనితాడేపల్లి వర్గాలు చెబుతున్నా యి. వచ్చే ఎన్నికలు కీలకమని చెబుతున్నా.. చాలా మంది నాయకులు పట్టనట్టు వ్యవహరించడం. లైట్ తీసుకోవడం సీఎం జగన్కు అస్సలు నచ్చడం లేదని అంటున్నారు. ఈ పరిణామాలపై మార్పు కొరడా ఝళిపించడమే బెటర్ అని భావించడంతో నేతల్లో దడ ప్రారంభమైంది.
This post was last modified on November 24, 2022 9:16 pm
స్టార్ హీరోలు ఎవరికైనా అభిమానులుంటారు. కానీ వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అందరి వల్ల కాదు. సీనియర్లలో చిరంజీవి…
ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు…
దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్…
టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ నిర్ణీత కాల వ్యవధిలోనే ముగిసింది. 16,347 మంది…