బీజేపీ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల కాలంలో కుటుంబ రాజకీయాలను తరిమి కొట్టాలి.. మేం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. పాపం.. సామాన్యులు నమ్మేసి ఉంటారు. కానీ, ఇదే బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో ఏం చేస్తోందంటే.. ఈ శ్రీరంగ నీతులకు యూటర్న్ ఇచ్చి.. అక్కడ వారసులకు టికెట్లు ప్రకటించింది. ఒకటి అరా అయితే, ఎవరూ పట్టించుకోరు. ఏకంగా తొలిదశ ఎన్నికల్లో ఏడు స్థానాలు, రెండో దశలో 12 స్థానాల్లో వారసులకు మొత్తం 19 సీట్లు కేటాయించింది. వీరి తరఫున ప్రచారం కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ భుజానేసుకున్నారు. మరి ఆ సంగతేంటో చూద్దామా..
సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే బీజేపీ ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. త్వరలో(డిసెంబరు 1-5) జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది. వారసుల రాకతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
విజయావకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు ఇలా వారసులకు టికెట్లు ఇచ్చామని బీజేపీనేతలు సమర్తించుకుంటున్నారు. చోటా ఉదయ్పుర్ స్థానాన్ని బీజేపీ నేత రత్వా కుమారుడు రాజేందర్సిన్హ్కు కేటాయించింది. థస్రా శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పార్మర్ మాజీ ఎమ్మెల్యే రామ్సిన్హ్ పార్మర్ కుమారుడు.
అదే పరంపరలో గుజరాత్కు చెందిన మాజీ ఎంపీ విట్టల్ రాదదియా కుమారుడు జయేశ్ రాదాదియాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. వీరితో పాటు అనేక మంది సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈ సారి ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి, ఈ పరిణామం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు కుటుంబ పాలన అనే మూస డైలాగును పక్కన పెడతారో లేదో చూడాలి.
This post was last modified on November 21, 2022 9:03 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న కొరియన్ కనకరాజుకి రేపు రాత్రి ప్రీమియర్లు వేయడం దాదాపు ఫిక్స్. ఇంకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు…
జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…