Political News

ఎమ్మ‌ల్యేను త‌రిమి కొట్టిన జ‌నాలు

దేశంలోనే కాదు, ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ ఘ‌ట‌న జ‌రిగినా అది ఆస‌క్తి అనుకుంటే నెటిజ‌న్లు నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయం వెల్ల‌డిస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉండ‌డం, డిజిట‌ల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌ల స్పంద‌న గ‌తంలో మాదిరిగా కాకుండా ఓ రేంజ్‌లో ఉంది. తాజాగా క‌ర్ణాట‌క‌లో ఓ ఎమ్మెల్యేను ప్ర‌జ‌లు త‌రిమి త‌రిమి కొట్టారు. ఎన్నాళ్లుగానో తాముఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌ద‌రు ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన జ‌నాలు.. త‌మ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యేకు చుక్క‌లు చూపించారు.

ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. అంతేకాదు, ఆయ‌న‌కు గాయాలు కూడా అయ్యాయి. ఈ ప‌రిణామం వైర‌ల్ కాగానే నెటిజ‌న్లు ఏపీపై ప‌డ్డారు. ఇక్క‌డ కూడా అనేక స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, రోడ్ల ప‌రిస్తితి దారుణంగా ఉంద‌ని.. సో రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి ఓట్లేయ‌మ‌ని వ‌చ్చే వైసీపీ నేత‌ల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఎద‌రవుతుందా? అంటూ నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మంళూరులో కలకలం రేగింది. ఎమ్మెల్యే కుమారస్వామిని గ్రామస్తులు చితక్కొట్టి.. త‌రిమి కొట్టారు. గ్రామస్తులు దాడికి దిగడంతో రక్షించుకునేందుకు ఎమ్మెల్యే రోడ్డుపై పరుగులు పెట్టారు. చిక్‌మంగళూరులో ఓ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే కుమారస్వామిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి రానివ్వకుండా దాడికి దిగారు.

ఏనుగుల సంచారం గురించి ఎంత మొరపెట్టుకున్నా.. ఎమ్మెల్యే వినలేదని గ్రామస్తులు మండిపడ్డారు. మనిషి చనిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు వస్తారా? అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. గ్రామస్తుల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గ్రామస్తులను అడ్డుకునే క్రమంలో తోపులాట, ఘర్షణ జరిగింది. కొందరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు పోలీసులు రక్షణ కవచంలా నిలబడినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఏపీకి అన్వ‌యిస్తూ.. నెటిజ‌న్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 21, 2022 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 minutes ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

11 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago