Political News

చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లింద‌ని కూతురిని చంపేసి..

క‌న్న‌కూతురుపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ తండ్రి. తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందనే కోపంతో క‌న్న పేగును హతమార్చాడు. అనంతరం కుమార్తె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో పెట్టి ఉత్తర్ప్రదేశ్ మథురలోని ఓ రోడ్డు పక్కన పడేశాడు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

ఉత్తర్ప్రదేశ్ మథురలో పరువు హత్య కలకలం రేపింది. ట్రాలీ బ్యాగులో 21 ఏళ్ల యువతి మృతదేహం కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. నవంబరు 17న జరిగిన ఈ ఘటన జరగ్గా.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని ఢిల్లీకి చెందిన ఆయుషీ యాదవ్గా గుర్తించారు.

ఎలా బ‌య‌ట ప‌డిందంటే..

యమునా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీసు రోడ్డు సమీపంలో ఓ బ్యాగులో రక్తంతో తడిసిన యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తేలింది. తనకు చెప్పకుండా బయటకు వెళ్లిందనే కోపంతో ఆయుషిని చంపానని నిందితుడు.. అంగీకరించాడు.

నవంబర్ 17న ఆయుషిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కాళ్లు, చేతులు మడిచి ట్రాలీ సూట్కేసులో పెట్టేశాడు. ఆయుషి మృతదేహాన్ని కారులో ఢిల్లీ నుంచి మథుర తీసుకొచ్చి.. యుమునా ఎక్స్ప్రెస్వే సర్వీస్ రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చిత్రం ఏంటంటే.. ఈ తండ్రికి ఆమె ఒక్క‌తే బిడ్డ‌. ఇంక పిల్ల‌లు లేరు. మ‌రి చేతులు ఎలా వ‌చ్చాయో..!!

This post was last modified on November 21, 2022 2:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Crime

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

19 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago