టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా.. వెంటనే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయకులు, పార్టీ అధిష్టానం.. కీలక నేతలు కూడా ఇటీవల కాలంలో లైట్ తీసుకుంటున్న విషయం తెలుసా? గతంలో చంద్రబాబు ఎక్కడ ఏం మాట్లాడినా.. వెంటనే వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యేవారు. కౌంటర్ ఎటాక్ చేసేవారు. కానీ, ఇటీవల కాలంలో మాత్రం ఎవరూ బాబు విషయంలో రియాక్ట్ కావడం లేదు. మరి ఎందుకు ఇలా.. వ్యూహం మారిపోయింది? ఇదీ.. ఇప్పుడు ఆసక్తికర చర్చ. వైసీపీ నేతలు.. కొన్నాళ్లుగా చంద్రబాబును పక్కన పెట్టేశారనే వాదన వినిపిస్తున్నా.. ఈ రేంజ్లో మాత్రం ఎప్పుడూ చర్చకు రాలేదు.
గతంలో చంద్రబాబు ఎక్కడ ఏ కామెంట్ చేసినా.. మంత్రులు, నాయకులు, ఫైర్ బ్రాండ్లు రియాక్ట్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరూ కూడా పెద్దగా స్పందించడం లేదు. ఒకవేళ ఎవరైనా స్పందించినా ఎమ్మెల్యే స్థాయి నాయకులే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు కామెంట్లపై స్పందించడం ద్వారా.. ప్రతిపక్షం ఇంకా బలంగా ఉందనే సంకేతాలు పంపుతున్నట్టు అవుతుందని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కానీ, క్షేత్రస్థాయిలో మంత్రులు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు పని అయిపోయిందని.. పార్టీ మళ్లీ ఓటమి ఖాయమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అధిష్టానం.. టీడీపీ అధినేత విషయంలో రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని నేతలకు దిశానిర్దేశం చేసినట్టు చెబుతున్నారు. మరి ఈ వ్యూహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పసిగట్టారో లేదో చూడాలి. అదేసమయంలో పవన్ విషయంలో మాత్రం మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. పవన్ ఎక్కడ ఏం మాట్లాడినా.. చిన్న ట్వీట్ చేసినా.. స్పందిస్తున్నారు. కౌంటర్లు ఇస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు అయినా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. పవన్ విషయంలో మాత్రం అది కూడాలేదు.
అయినా.. పవన్ విషయంలో మాత్రం వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటి? అంటే.. వచ్చే ఎన్నికల్లో యూత్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. పవన్ వెనుక యువత ఉంటారనేది వాస్తవం. అందుకే .. వారి ఓట్లు అటు వైపు మళ్లకుండా చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పవన్కు కౌంటర్లు ఇస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో యూత్ నమ్ముతారా? అనేది మరో ప్రశ్న. ఎందుకంటే.. పవన్ విషయంలో ఏం చేసినా.. ఏం మాట్లాడినా యూత్ నమ్మే పరిస్థితిలేదు. అయినప్పటికీ..వైసీపీ మాత్రం ఎదురుదాడిని అటు మళ్లించడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 16, 2022 12:16 pm
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…