Political News

బాబును లైట్ తీసుకుంటున్న వైసీపీ.. లెక్క‌లేంటి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏం మాట్లాడినా.. వెంట‌నే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయ‌కులు, పార్టీ అధిష్టానం.. కీల‌క నేత‌లు కూడా ఇటీవ‌ల కాలంలో లైట్ తీసుకుంటున్న విష‌యం తెలుసా? గ‌తంలో చంద్ర‌బాబు ఎక్క‌డ ఏం మాట్లాడినా.. వెంట‌నే వైసీపీ నాయ‌కులు రియాక్ట్ అయ్యేవారు. కౌంట‌ర్ ఎటాక్ చేసేవారు. కానీ, ఇటీవ‌ల కాలంలో మాత్రం ఎవ‌రూ బాబు విష‌యంలో రియాక్ట్ కావ‌డం లేదు. మ‌రి ఎందుకు ఇలా.. వ్యూహం మారిపోయింది? ఇదీ.. ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. వైసీపీ నేత‌లు.. కొన్నాళ్లుగా చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టేశార‌నే వాద‌న వినిపిస్తున్నా.. ఈ రేంజ్‌లో మాత్రం ఎప్పుడూ చ‌ర్చ‌కు రాలేదు.

గ‌తంలో చంద్ర‌బాబు ఎక్క‌డ ఏ కామెంట్ చేసినా.. మంత్రులు, నాయ‌కులు, ఫైర్ బ్రాండ్లు రియాక్ట్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎవ‌రూ కూడా పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా స్పందించినా ఎమ్మెల్యే స్థాయి నాయ‌కులే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. చంద్ర‌బాబు కామెంట్ల‌పై స్పందించ‌డం ద్వారా.. ప్ర‌తిప‌క్షం ఇంకా బ‌లంగా ఉంద‌నే సంకేతాలు పంపుతున్న‌ట్టు అవుతుంద‌ని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కానీ, క్షేత్ర‌స్థాయిలో మంత్రులు కానీ, నాయ‌కులు కానీ, చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని.. పార్టీ మ‌ళ్లీ ఓట‌మి ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే అధిష్టానం.. టీడీపీ అధినేత విష‌యంలో రియాక్ట్ కావాల్సిన అవ‌స‌రం లేద‌ని నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఈ వ్యూహాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌సిగ‌ట్టారో లేదో చూడాలి. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ విష‌యంలో మాత్రం మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. ప‌వన్ ఎక్క‌డ ఏం మాట్లాడినా.. చిన్న ట్వీట్ చేసినా.. స్పందిస్తున్నారు. కౌంట‌ర్లు ఇస్తున్నారు. నిజానికి చంద్ర‌బాబుకు అయినా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ప‌వ‌న్ విష‌యంలో మాత్రం అది కూడాలేదు.

అయినా.. ప‌వ‌న్‌ విష‌యంలో మాత్రం వైసీపీ నాయ‌కులు రియాక్ట్ అవుతున్నారు. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యూత్ ఓట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ప‌వ‌న్ వెనుక యువత ఉంటార‌నేది వాస్త‌వం. అందుకే .. వారి ఓట్లు అటు వైపు మ‌ళ్ల‌కుండా చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్‌కు కౌంట‌ర్లు ఇస్తోంద‌నే విశ్లేష‌ణలు వ‌స్తున్నాయి. కానీ, ఈ విష‌యంలో యూత్ న‌మ్ముతారా? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప‌వ‌న్ విష‌యంలో ఏం చేసినా.. ఏం మాట్లాడినా యూత్ న‌మ్మే ప‌రిస్థితిలేదు. అయిన‌ప్ప‌టికీ..వైసీపీ మాత్రం ఎదురుదాడిని అటు మ‌ళ్లించ‌డం వెనుక కార‌ణం ఇదేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 16, 2022 12:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

2 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

2 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

3 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

3 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

3 hours ago