Political News

ఏపీ బీజేపీకి మోడీ క్లాస్‌.. ప‌నిచేస్తుందా..?

ఏపీ బీజేపీకి ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బాగానే త‌లంటారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ఎందుకు తీసుకువెళ్ల‌లేక పోతున్నార‌నే విష‌యంపై ఆయ‌న తెలుసుకున్నారు. దీనిపై స్థానిక బీజేపీ కోర్ క‌మిటీకి కొన్ని దిశానిర్దేశాలు చేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా? లేదా? అనేది ప‌క్క‌న పెట్టి నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని.. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ ఓట్లు ప్ర‌ధానంగా ప‌నిచేస్తున్నాయ‌నే వాద‌న‌ను కూడా మోడీ వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

మ‌రి ఈ నేప‌థ్యంలో మోడీ క్లాస్ ఏపీ నేత‌ల‌పై ఏమేర‌కు ప‌నిచేస్తుంది? అనేది ఇప్పుడు బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. బీజేపీ నేత‌ల్లో చాలా మంది వైసీపీతో సంబందాలు ఉన్న‌వారే ఉన్నారు. జీవీఎల్‌, స‌త్య‌కుమార్‌, సోము వీర్రాజు.. వంటి కీల‌క నాయ‌కుల‌కు వైసీపీలోని చాలా అగ్ర స్థానంలో ఉన్న నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. దీంతో వారిని వీరు.. వీరిని వారు ఏమీ అన‌రు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. పైకి ఎంత విమ‌ర్శ‌లు చేసినా.. పెద‌బొబ్బ‌లు పెట్టినా.. ప్ర‌జ‌ల్లోకి మాత్రం ఈ సంకేతాలు ఎప్పుడో వెళ్లిపోయాయి.

కొన్నాళ్ల కింద‌ట‌.. సోము వీర్రాజు రాజ‌ధాని గ్రామాల్లో పర్య‌టించిన‌ప్పుడు.. రైతుల‌కు మేం అండ‌గా ఉంటాం. రాజ‌ధాని ఇక్క‌డే ఉంటుంది. అని స‌ర్ది చెప్ప‌బోయారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. మీరు మీరు ఒక‌టేగా! అని రైతులు సోము వీర్రాజు మొహంపైనే అడిగేశారు. దీంతో ముందు దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు బీజేపీ కీల‌క నాయ‌కురాలు పురందేశ్వ‌రి ఏం చెప్పినా.. బీజేపీ నాయ‌కులు వినిపించుకోవ‌డం లేదు. ఇదే విష‌యాన్ని ఆమె ప్ర‌దాని ముందు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఆమెకు టీడీపీతో స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని, కండువా క‌ప్పుకోక‌పోయినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆమె కుమారుడికి టికెట్ ఇచ్చార‌ని బీజేపీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆమెను ప‌క్క‌న పెట్టారు. అయితే, మోడీ మాత్రం ఈ విష‌యాన్ని న‌డ్డాతో చ‌ర్చించాల‌ని సూచించి త‌ప్పుకొన్నారు. ఇక‌, జీవీఎల్‌కు, సీఎంజ‌గ‌న్ బావ‌మ‌రిది అనిల్‌కు మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న అందుకే మౌనంగా ఉంటున్నార‌ని కూడా బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇలా .. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌ల‌తోనే స‌రిపుచ్చుకుంటున్నారు త‌ప్పితే.. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డంపై మాత్రం ఎవ‌రూ దృష్టి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌దాని హెచ్చ‌రించి మూడు రోజులు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కూ రూప‌క‌ల్ప‌న చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 15, 2022 10:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని 500 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నాడు.…

60 minutes ago

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఇంకెప్పుడు?

బాలయ్య అభిమానులు ఎదురుచూసే కొద్దీ దూరం వెళ్తున్నాడు మోక్షజ్ఞ. ఎప్పుడెప్పుడాని వెయిట్ చేస్తుంటే ఇప్పుడప్పుడే కాదనే తరహాలో ఇస్తున్న సంకేతాలు…

3 hours ago

వంగా అసలు ఆలోచన ఏంటి?

సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. ‘యానిమల్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

3 hours ago

ఘట్టమనేని వారసుడి గురించి టాక్ ఏంటి

ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది.…

4 hours ago

గాయపడ్డ హీరో గట్టిగా కొడతాడా

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కల్ట్ మూవీస్ తో ఒక ప్రత్యేక ముద్ర వేసిన దర్శకుడు తరుణ్…

8 hours ago

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

9 hours ago