Political News

ఏపీ బీజేపీకి మోడీ క్లాస్‌.. ప‌నిచేస్తుందా..?

ఏపీ బీజేపీకి ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బాగానే త‌లంటారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ఎందుకు తీసుకువెళ్ల‌లేక పోతున్నార‌నే విష‌యంపై ఆయ‌న తెలుసుకున్నారు. దీనిపై స్థానిక బీజేపీ కోర్ క‌మిటీకి కొన్ని దిశానిర్దేశాలు చేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామా? లేదా? అనేది ప‌క్క‌న పెట్టి నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని.. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ ఓట్లు ప్ర‌ధానంగా ప‌నిచేస్తున్నాయ‌నే వాద‌న‌ను కూడా మోడీ వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

మ‌రి ఈ నేప‌థ్యంలో మోడీ క్లాస్ ఏపీ నేత‌ల‌పై ఏమేర‌కు ప‌నిచేస్తుంది? అనేది ఇప్పుడు బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. బీజేపీ నేత‌ల్లో చాలా మంది వైసీపీతో సంబందాలు ఉన్న‌వారే ఉన్నారు. జీవీఎల్‌, స‌త్య‌కుమార్‌, సోము వీర్రాజు.. వంటి కీల‌క నాయ‌కుల‌కు వైసీపీలోని చాలా అగ్ర స్థానంలో ఉన్న నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు ఉన్నాయి. దీంతో వారిని వీరు.. వీరిని వారు ఏమీ అన‌రు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. పైకి ఎంత విమ‌ర్శ‌లు చేసినా.. పెద‌బొబ్బ‌లు పెట్టినా.. ప్ర‌జ‌ల్లోకి మాత్రం ఈ సంకేతాలు ఎప్పుడో వెళ్లిపోయాయి.

కొన్నాళ్ల కింద‌ట‌.. సోము వీర్రాజు రాజ‌ధాని గ్రామాల్లో పర్య‌టించిన‌ప్పుడు.. రైతుల‌కు మేం అండ‌గా ఉంటాం. రాజ‌ధాని ఇక్క‌డే ఉంటుంది. అని స‌ర్ది చెప్ప‌బోయారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. మీరు మీరు ఒక‌టేగా! అని రైతులు సోము వీర్రాజు మొహంపైనే అడిగేశారు. దీంతో ముందు దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డంపై నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మ‌రోవైపు బీజేపీ కీల‌క నాయ‌కురాలు పురందేశ్వ‌రి ఏం చెప్పినా.. బీజేపీ నాయ‌కులు వినిపించుకోవ‌డం లేదు. ఇదే విష‌యాన్ని ఆమె ప్ర‌దాని ముందు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఆమెకు టీడీపీతో స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని, కండువా క‌ప్పుకోక‌పోయినా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆమె కుమారుడికి టికెట్ ఇచ్చార‌ని బీజేపీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆమెను ప‌క్క‌న పెట్టారు. అయితే, మోడీ మాత్రం ఈ విష‌యాన్ని న‌డ్డాతో చ‌ర్చించాల‌ని సూచించి త‌ప్పుకొన్నారు. ఇక‌, జీవీఎల్‌కు, సీఎంజ‌గ‌న్ బావ‌మ‌రిది అనిల్‌కు మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న అందుకే మౌనంగా ఉంటున్నార‌ని కూడా బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇలా .. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌ల‌తోనే స‌రిపుచ్చుకుంటున్నారు త‌ప్పితే.. పార్టీని ముందుకు తీసుకువెళ్ల‌డంపై మాత్రం ఎవ‌రూ దృష్టి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌దాని హెచ్చ‌రించి మూడు రోజులు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కూ రూప‌క‌ల్ప‌న చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 15, 2022 10:27 am

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

4 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

5 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

6 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

7 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

11 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

12 hours ago