Political News

మంగ‌ళ‌గిరిలో రెడ్డి నాయ‌కుల‌ను Bye Bye.. జగన్ అనేశారు

‘గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంది? అస‌లు ఎందుకింత రాజ‌కీయం ర‌చ్చ‌గా మారింది? త‌క్ష‌ణం నివేదిక ఇవ్వండి!’ ఇదీ.. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు పార్టీ అధిష్టానం తాజాగా ఆదేశాలు చేసింద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గ‌న్‌కు అత్యంత ముఖ్యుడు, స‌న్నిహితుడు ఆళ్ల రామ‌కృష్నారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే ఇక్క‌డ రాజ‌కీయాలు సాగుతున్నాయి. అయితే, ఇటీవ‌ల ఇప్ప‌టంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌ర్య‌టించ‌డం.. అక్కడ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, అనంత‌రం స‌వాళ్లు రువ్వ‌డం వంటివి అధిష్టానానికి బాగానే తాకాయి. అయితే, వాటికి కౌంట‌ర్లు ఇవ్వ‌డంలోనూ, ప‌వ‌న్‌పై ఎదురు దాడి చేయ‌డంలోనూ ఎమ్మెల్యే ఆళ్ల వెనుక‌బ‌డ్డార‌నే అసంతృప్తి కూడా అధిష్టానంలో క‌నిపించింది. ఇది ఒక ప‌క్క ఇబ్బందిగా ఉండ‌గానే మ‌రోవైపు.. తాజాగా ఇంకో ఘ‌ట‌న చోటు చేసుకుంది.

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్క‌డ ప‌ర్య‌టించి సుమారు 50 మంది వ‌రకు రెడ్డి నాయ‌కుల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో ఆళ్ల‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వెళ్లి టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డం, ఈ సంద‌ర్భంగా వైసీపీ రెడ్లంద‌రూ వ‌చ్చేయండి పార్టీలో చేర్చుకుంటాం అని లోకేష్ పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంత జ‌రిగినా ఎమ్మెల్యే ఆళ్ల మాత్రం ఎక్క‌డా రియాక్ట్ కాలేదు.

దీంతో హుటాహుటిన ఇక్క‌డ ప‌ర్య‌టించి అస‌లు ఏం జ‌రుగుతోందో చెప్పాల‌ని, నివేదిక రూపంలో ఇవ్వాల ని పార్టీ అధిష్టానం ఇంచార్జ్ సుచ‌రిత‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉన్న సుచ‌రిత రేపు లేదా ఎల్లుండి వ‌చ్చి ఇక్క‌డ ప‌ర్య‌టించి పార్టీ నేత‌ల నుంచి స‌మాచారం సేక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి మంగ‌ళ‌గిరిలో వారం వ్య‌వ‌ధిలో చోటుచేసుకున్ని ఇప్ప‌టం గ్రామ వ్య‌వ‌హారం, పార్టీలో జంపింగుల‌పై అధిష్టానం వెంట‌నే రియాక్ట్ అవ‌డం ఆస‌క్తిగా మారింది.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago