Political News

మంగ‌ళ‌గిరిలో రెడ్డి నాయ‌కుల‌ను Bye Bye.. జగన్ అనేశారు

‘గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతోంది? అస‌లు ఎందుకింత రాజ‌కీయం ర‌చ్చ‌గా మారింది? త‌క్ష‌ణం నివేదిక ఇవ్వండి!’ ఇదీ.. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు పార్టీ అధిష్టానం తాజాగా ఆదేశాలు చేసింద‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం జ‌గ‌న్‌కు అత్యంత ముఖ్యుడు, స‌న్నిహితుడు ఆళ్ల రామ‌కృష్నారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే ఇక్క‌డ రాజ‌కీయాలు సాగుతున్నాయి. అయితే, ఇటీవ‌ల ఇప్ప‌టంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌ర్య‌టించ‌డం.. అక్కడ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, అనంత‌రం స‌వాళ్లు రువ్వ‌డం వంటివి అధిష్టానానికి బాగానే తాకాయి. అయితే, వాటికి కౌంట‌ర్లు ఇవ్వ‌డంలోనూ, ప‌వ‌న్‌పై ఎదురు దాడి చేయ‌డంలోనూ ఎమ్మెల్యే ఆళ్ల వెనుక‌బ‌డ్డార‌నే అసంతృప్తి కూడా అధిష్టానంలో క‌నిపించింది. ఇది ఒక ప‌క్క ఇబ్బందిగా ఉండ‌గానే మ‌రోవైపు.. తాజాగా ఇంకో ఘ‌ట‌న చోటు చేసుకుంది.

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్క‌డ ప‌ర్య‌టించి సుమారు 50 మంది వ‌రకు రెడ్డి నాయ‌కుల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో ఆళ్ల‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వెళ్లి టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డం, ఈ సంద‌ర్భంగా వైసీపీ రెడ్లంద‌రూ వ‌చ్చేయండి పార్టీలో చేర్చుకుంటాం అని లోకేష్ పిలుపునివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంత జ‌రిగినా ఎమ్మెల్యే ఆళ్ల మాత్రం ఎక్క‌డా రియాక్ట్ కాలేదు.

దీంతో హుటాహుటిన ఇక్క‌డ ప‌ర్య‌టించి అస‌లు ఏం జ‌రుగుతోందో చెప్పాల‌ని, నివేదిక రూపంలో ఇవ్వాల ని పార్టీ అధిష్టానం ఇంచార్జ్ సుచ‌రిత‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉన్న సుచ‌రిత రేపు లేదా ఎల్లుండి వ‌చ్చి ఇక్క‌డ ప‌ర్య‌టించి పార్టీ నేత‌ల నుంచి స‌మాచారం సేక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి మంగ‌ళ‌గిరిలో వారం వ్య‌వ‌ధిలో చోటుచేసుకున్ని ఇప్ప‌టం గ్రామ వ్య‌వ‌హారం, పార్టీలో జంపింగుల‌పై అధిష్టానం వెంట‌నే రియాక్ట్ అవ‌డం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on November 14, 2022 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

42 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago