వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వస్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటీవల కాలంలో దాదాపు మేనిఫెస్టోను ప్రకటించేస్తున్నారు. అంతేకాదు.. తాను సీఎం అయ్యాక చేసే తొలి రెండు సంతకాలు ఇవే అని కూడా చెబుతున్నారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోపై పవన్ క్లారిటీకి వచ్చేశారా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల ఇప్పటంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను సీఎం కాగానే.. రాష్ట్రంలోని ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఇదే తన రెండో సంతకం అని కూడా ప్రకటించి ఉద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే, దీనిపై పవన్ కు ఉద్యోగుల నుంచి ఆశించిన రియాక్షన్ అయితే రాలేదు. కానీ, ఆయన మాత్రం దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. తొలి సంతకం.. సుగాలి ప్రీతికి న్యాయం చేయడం పైనే ఉంటుందని అన్నారు. ఇక, తాజాగా విజయనగరంలో జగనన్న ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన పవన్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలపై ఎన్నికల వరాలు కురిపించారు.
తాము అధికారంలోకి వస్తే..ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు యథావిథిగా కొనసాగిస్తామని పవన్ చెప్పారు. అంటే.. ఇప్పటి వరకు వైసీపీ అనుసరించిన పథకాలను అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటి అన్నింటినీ తాము అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. వీటికి అదనంగా.. ఇసుకను కూడా ఉచితంగా ఇస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాదు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, తాము అధికారంలోకి వచ్చాక.. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అవినీతి రహితంగా రాష్ట్రాన్ని పాలిస్తామని పవన్ ప్రకటించారు. ఎవరు అవినీతికి పాల్పడినా.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం జగన్ ఉద్దేశించి అన్నారు. మొత్తానికి పవన్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే.,. హామీలు ప్రకటించడం, సంతకాలు చేస్తుండడం ఆసక్తిగా మారింది. మరి దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
This post was last modified on November 14, 2022 6:52 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…