Political News

ప‌వ‌న్ తో మాట్లాడితే.. ప‌ట్టా ర‌ద్దే?

ఏపీలో కొత్త రూల్ పాసైన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని జ‌నసేన పార్టీ నాయ‌కులు అంటున్నారు. తాజాగా విజ‌య న‌గ‌రం జిల్లాలో ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇస్తున్న జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీకి సంబంధించిన లే అవుట్‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిశీలించ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం కింద వైసీపీ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇళ్లు ఇస్తోంది. అయితే.. విజ‌య‌న‌గ‌రంలో వేసిన గుంక‌లాం అతి పెద్ద లే అవుట్‌. ఈ నేప‌థ్యంలో దీనిని ప‌రిశీలించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు.

కానీ, గుంక‌లాం జగనన్న కాలనీల్లో లబ్దిదారులు ఎవ‌రైనా ప‌వ‌న్‌తో మాట్లాడితే వారికి ఇచ్చిన ఇంటి ప‌ట్టాను ర‌ద్దు చేస్తామ‌ని అధికారుల నుంచి బెదిరింపులు వ‌చ్చిన‌ట్టు జ‌న‌సేన పీఏసీ సభ్యుడు తాతారావు చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోవైపు పవన్ కల్యాణ్ గుంకలానికి రావటాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

గుంకలాం లే అవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారు. అక్కడ వాస్తవంగా ఎకరం ధర 10 లక్షలు అయితే వైసీపీ నేతలు 70 లక్షలకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారనే విమ‌ర్శ‌లు గ‌తంలోనే వ‌చ్చాయి. 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు కనీసం 12 ఇళ్లు కూడా పూర్తి చేయక‌పోవ‌డంపై ఇటీవ‌ల అసెంబ్లీలోనూ ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు ప్ర‌శ్నించారు.

విజయనగరం మండలం గుంకలాం జగనన్న కాలనీలో పవన్‌ పర్యటనను స్వాగతిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని రాజకీయ ఉనికి కోసం వాడుకోవద్దని కోరారు. ఈ లేఅవుట్ లో నిర్మాణాలు జరగటం లేదని తప్పుడు సమాచారంతో పవన్ కల్యాణ్ ఇక్కడికి రావటం సరికాదని ఆయన అన్నారు.

ప్రభుత్వం లబ్దిదారులకు 5 లక్షల రూపాయల విలువైన స్థలం ఇచ్చింది. అలాగే ఇంటి నిర్మాణానికి లక్షన్నర సహాయం చేస్తామని ఇంతకుముందే చెప్పామ‌న్నారు. ఇవే కాకుండా ఇసుక, సిమెంటు, ఇనుమూ లబ్దిదారులకు అందుబాటులో ఉంచామన్నారు. మ‌రి దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on November 13, 2022 8:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago