Political News

ప‌వ‌న్ తో మాట్లాడితే.. ప‌ట్టా ర‌ద్దే?

ఏపీలో కొత్త రూల్ పాసైన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని జ‌నసేన పార్టీ నాయ‌కులు అంటున్నారు. తాజాగా విజ‌య న‌గ‌రం జిల్లాలో ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇస్తున్న జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీకి సంబంధించిన లే అవుట్‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిశీలించ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం కింద వైసీపీ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇళ్లు ఇస్తోంది. అయితే.. విజ‌య‌న‌గ‌రంలో వేసిన గుంక‌లాం అతి పెద్ద లే అవుట్‌. ఈ నేప‌థ్యంలో దీనిని ప‌రిశీలించాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు.

కానీ, గుంక‌లాం జగనన్న కాలనీల్లో లబ్దిదారులు ఎవ‌రైనా ప‌వ‌న్‌తో మాట్లాడితే వారికి ఇచ్చిన ఇంటి ప‌ట్టాను ర‌ద్దు చేస్తామ‌ని అధికారుల నుంచి బెదిరింపులు వ‌చ్చిన‌ట్టు జ‌న‌సేన పీఏసీ సభ్యుడు తాతారావు చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోవైపు పవన్ కల్యాణ్ గుంకలానికి రావటాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

గుంకలాం లే అవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారు. అక్కడ వాస్తవంగా ఎకరం ధర 10 లక్షలు అయితే వైసీపీ నేతలు 70 లక్షలకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారనే విమ‌ర్శ‌లు గ‌తంలోనే వ‌చ్చాయి. 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు కనీసం 12 ఇళ్లు కూడా పూర్తి చేయక‌పోవ‌డంపై ఇటీవ‌ల అసెంబ్లీలోనూ ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు ప్ర‌శ్నించారు.

విజయనగరం మండలం గుంకలాం జగనన్న కాలనీలో పవన్‌ పర్యటనను స్వాగతిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని రాజకీయ ఉనికి కోసం వాడుకోవద్దని కోరారు. ఈ లేఅవుట్ లో నిర్మాణాలు జరగటం లేదని తప్పుడు సమాచారంతో పవన్ కల్యాణ్ ఇక్కడికి రావటం సరికాదని ఆయన అన్నారు.

ప్రభుత్వం లబ్దిదారులకు 5 లక్షల రూపాయల విలువైన స్థలం ఇచ్చింది. అలాగే ఇంటి నిర్మాణానికి లక్షన్నర సహాయం చేస్తామని ఇంతకుముందే చెప్పామ‌న్నారు. ఇవే కాకుండా ఇసుక, సిమెంటు, ఇనుమూ లబ్దిదారులకు అందుబాటులో ఉంచామన్నారు. మ‌రి దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on November 13, 2022 8:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన…

12 minutes ago

తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…

5 hours ago

చంద్ర‌బాబు గారూ… నంది అవార్డులు ప్ర‌క‌టించండి సార్

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

7 hours ago

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…

7 hours ago

సాయిపల్లవిపై ఎందుకింత నెగెటివిటీ?

గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…

9 hours ago

బాబు కొత్త నిర్ణయం… వారి పరిస్థితి ఏమిటి?

రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని.. దీనికి మ‌హిళ‌లు కూడా సిద్ధంగా ఉండాల‌ని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…

10 hours ago