Political News

గంటా వెళ్లింది పవన్ కోసమా?

ఏపీలో రాజకీయం ఎంత జోరుగా సాగుతుందన్న విషయం తెలిసిందే. ఒకటి తర్వాత ఒకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజే.. పొలిటికల్ సంచనాలునమోదు అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

మోడీ పర్యటన సందర్భంగా.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని జగన్ తన మాటలతోనూ.. చేతలతోనూ చేసి చూపిస్తే.. జగన్ సర్కారు చేసిన తప్పులపై విరుచుకుపడాలంటూ ప్రధాని మోడీ బీజేపీ నేతలకు చెప్పినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖకు ఆహ్వానించిన మోడీని.. పవన్ కలవటం.. ఆయనతో నలభై నిమిషాలకు పైగా భేటీ కావటం తెలిసిందే.

ఈ భేటీలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తుంటే.. ఆ వాదనలో పస లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి గంటా.. టీడీపీలో కొనసాగుతూ కూడా.. ఇప్పటికి ఏ పార్టీలో ఉన్నారన్న దానిపై స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు.. పార్టీ మారతారో అన్నదానిపై తరచూ వార్తలు రావటం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ నొవాటెల్ లో బస చేశారు. అక్కడకు గంటా రావటం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.

పవన్ బస చేసిన ఐదో అంతస్తుకు ఆయన వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ భేటీ అయినట్లుగా చెబుతున్నారు. దీనిపై బోలెడన్ని విశ్లేషణలు వచ్చేశాయి. కానీ.. వాస్తవం ఏమంటే.. బీజేపీ నేత టీజీ వెంకటేశ్ అదే హోటల్ లో లంచ్ కు గంటాను ఆహ్వానించటంతో ఆయన వెళ్లారని.. అక్కడే పవన్ ఉండటంతో.. పాత పరిచయంతో వెళ్లి కలిసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు గంటా సిద్ధమయ్యారని.. తాజా పరిణామం నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారా? జనసేనలో చేరతారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

43 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

49 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago