Political News

మోడీ.. ఏపీకి చెప్పిందేంటంటే?

ఔను.. అంతా ఊక‌దంపుడే. ప్ర‌ధాని మోడీ తాజాగా విశాఖ‌లో చేసిన ప్ర‌సంగంలో ఎక్క‌డా ఒక్క ముక్క ఏపీ అభివృద్ధిని కాంక్షించేలా క‌నిపించ‌లేదు. జాతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పైనే ఆయ‌న ప్ర‌సంగించారు. అంత‌కుమించి.. ఏపీని ఉద్దేశించి కీల‌క‌మైన అంశాల‌ను ప‌క్క‌న పెట్టేశారు. సో.. మొత్తానికి మోడీ ప‌ర్య‌ట‌నలో ఆయ‌న ప్ర‌సంగంలో ఎక్క‌డా.. ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాలు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌సంగంలో మోడీ పాఠం ఇదే!

ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ప్రజలు రాణిస్తున్నారన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. కొన్ని నెలల కిందట అల్లూరి జయంతి వేడుకలకు వచ్చే సౌభాగ్యం కలిగిందని తెలిపారు.

భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోడీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు.

వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు. మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం.. అని మోడీ అన్నారు.

సమ్మిళిత అభివృద్ధే తమ ఆలోచన అని ప్రధాని తెలిపారు. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో తాము ఎప్పుడూ సందేహించలేదని తెలిపారు. శాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నామన్నారు. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోందని వ్యాఖ్యానించారు. మిషన్‌ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచామని పేర్కొన్నారు.

ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్‌ వైపు చూస్తోంది. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం. పీఎం కిసాన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నాం. పేదలకు మరిన్ని పథకాలు విస్తరిస్తున్నాం. మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఉపయోగపడుతున్నాయి.. అని మోడీ చెప్పారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

This post was last modified on November 13, 2022 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

1 minute ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

25 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago