Political News

ప‌వ‌న్ పవర్ఫుల్ సంకేతాలు

తాజాగా విశాఖ‌కు వ‌చ్చిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ భేటీ అయ్యారు. ఇది రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌కు కూడా మోడీ అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌కుండా.. త‌న మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం ఆశ్చ‌ర్య‌మ‌నే అనిపించింది. నిజానికి మోడీ చాలా రాష్ట్రాల్లోనే ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డి మిత్ర‌పక్ష నాయ‌కుల‌కు ఆయ‌న అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌డం లేదు.

కానీ, ఏపీని భిన్నంగా చూస్తున్న సంకేతాలు ఇస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ.. జ‌న‌సేనానితో భేటీ కావడం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే, ఈ భేటీ ద్వారా ఇటు ప‌వ‌న్‌కానీ, అటు మోడీ కానీ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు పంపించాల‌ని అనుకుంటున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితి ఏపీలో భిన్నంగా ఉంది. టీడీపీ-జ‌న‌సేన చేతులు క‌ల‌పాల‌ని అనుకుంటున్నాయి. దీనిని వైసీపీ వ్య‌తిరేకిస్తోంది.

ఇదే విష‌యంపై కొన్నాళ్లుగా బీజేపీతో వైసీపీ అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు చేస్తోంది. ప‌వ‌న్ ను మీరు వ‌దులు కోవ‌ద్దు.. అంటూ.. ప‌రోక్షంగా టీడీపీకి దెబ్బేసే కార్య‌క్ర‌మం తెర‌చాటున జ‌రిగిపోతోంది. ఇక్క‌డ బీజేపీ కూడా ప‌వ‌న్‌ను వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ప‌వ‌న్ ద్వారా 10 స్థానాల్లో అయినా గుర్తింపు తెచ్చుకుంటే త‌ద్వారా రాష్ట్రంలో విస్త‌రించే కార్య‌క్ర‌మానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పుడు ఇదే వ్యూహం నేప‌థ్యంలో మోడీ ఆయ‌న‌కు అప్పాయింట్‌మెంటు ఇచ్చార‌నే చ‌ర్చ‌సాగుతోంది.

బీజేపీ నాయ‌కులు కూడా త‌మ‌కు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేద‌ని బాధ‌ప‌డ‌డంలేదు. ప‌వన్‌కు అప్పా యింట్‌మెంటు ఇవ్వ‌డాన్ని వారు స్వాగ‌తిస్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ కూడా మోడీని క‌ల‌వ‌డం ద్వారా.. ఆయ‌న వ్యూహం వేరేగా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ డం, పార్టీలో నైతిక స్థ‌యిర్యాన్ని పెంచ‌డం వంటి కీల‌క అంశాల‌ను ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నారు. నా వెనుక కేంద్ర‌మే ఉంది.. మోడీ ఉన్నాడ‌నే సంకేతాల‌ను ప‌వ‌న్ పంపించాల‌నేది వ్యూహం. ఈ రెండు వ్యూహాల నేప‌థ్యంలోనే ఇరు ప‌క్షాలు ప్ర‌ధాని భేటీకి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on November 13, 2022 3:31 pm

Share

Recent Posts

బాధితులను వదిలేసి నిందితులకు పరమార్శేంటి జగన్?

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజును జైల్లో ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అప్ప‌ల‌రాజును…

3 hours ago

న‌న్ను రాజీనామా కోరే హ‌క్కు ఎవ‌రికీ లేదు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌పైనా తాను ముఖ్య‌మంత్రిని కాలేద‌ని.. 4 కోట్ల మంది ఓట‌ర్లు ఓటేసి త‌న‌ను గెలిపించుకున్నార‌ని.. వారి ఆశీర్వాదం,…

4 hours ago

‘పిల్లలను హాస్టల్లో వేస్తే… వాళ్ళు పెద్దలను ఓల్డేజ్ హోమ్ లలో వేస్తారు’

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…

5 hours ago

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…

6 hours ago

ప్రమోషన్లకు పిలవలేదని హర్టయిన హీరోయిన్

తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…

7 hours ago

ఆదిపురుష్ పోలిక ఇప్పుడు అనవసరం

ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…

8 hours ago