Political News

లోకేశ్ పాదయాత్ర.. ఆ రెండే లక్ష్యమా?

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. మాజీ మంత్రి నారా లోకేశ్ పై వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేకపోయిన వైనం.. ఆయన సామర్థ్యంపై కొత్త సందేహాలకు తెర తీసింది. ప్రత్యక్ష రాజకీయాలతో చట్టసభలకు ఎంట్రీ ఇవ్వని లోకేశ్.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవితో మంత్రిగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. అయితే.. చినబాబుకు సామర్థ్యం లేదని.. ఆయన రాజకీయాల్లో తన ముద్రను చూపించలేరంటూ ప్రచారం జరగటం తెలిసిందే.

లోకేశ్ అన్నంతనే పప్పు.. పప్పు నాయుడు.. ఇలాంటి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తరచూ విరుచుకుపడటం తెలిసిందే. ఆయన మాటను.. ఆకారాన్ని వేలెత్తి చూపుతూ విమర్శలు చేసే వారికి.. కొవిడ్ వేళ.. సరికొత్త మేకోవర్ కోసం చాలానే కష్టపడిన లోకేశ్.. చివరకు అనుకున్నది సాధించారు. స్లిమ్ అయిన లోకేశ్.. తన డిక్షన్ లోని తప్పుల్ని సరిదిద్దుకున్నారు. గతంలో మాదిరి తరచూ తప్పులు మాట్లాడుతూ దొరికిపోకుండా ఉంటే.. కాస్తంత ఫైర్ ను పెంచారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ పాదయాత్ర చేస్తారని ఒకసారి.. కాదు సైకిల్ యాత్ర చేస్తారని మరోసారి.. అదేమీ కాదు బస్సుయాత్ర పక్కా అంటూ పలు వాదనలు..విశ్లేషణలు వినిపించాయి.

వీటికి భిన్నంగా లోకేశ్ ఎట్టకేలకు తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించారు. దీంతో.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమంటున్నారు. జనవరి 27న తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించే లోకేశ్.. రాయలసీమ నుంచి కోస్తాలోకి ఎంటర్ అయి.. ఉత్తరాంధ్రలో తన యాత్రను ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తొలుత జనవరి24 అనుకున్నా.. ఆ తర్వాత రిపబ్లిక్ డే 26 తర్వాతి రోజైన జనవరి 27 నుంచి పాదయాత్ర షురూ చేయాలని ఆయన నిర్ణయించారు.

2023 జనవరిలో మొదలయ్యే లోకేశ్ పాదయాత్ర.. 2024 ఫిబ్రవరి వరకు సాగుతుందని చెబుతున్నారు. అవసరమైతే మార్చి వరకు కంటిన్యూ చేసేందుకుసైతం తాను సిద్ధమన్న విషయాన్ని లోకేశ్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అంటే.. దగ్గర దగ్గర 400రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రతో తనను తానుఫ్రూవ్ చేసుకోవటంతోపాటు.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇష్యూల మీద తనకున్న అవగాహనను ప్రజలకు తెలియజేయటంతో పాటు.. తన సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేసే వారికి.. తన పాదయాత్రతో సమాధానం చెప్పాలన్నది లోకేశ్ లక్ష్యమంటున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి రేసులో తన తండ్రి చంద్రబాబు ఉండటం తెలిసిందే. చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను చెబుతున్నా.. ఆయనకు అంత సీన్ లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. తనను తాను నిరూపించుకోవటంతో పాటు.. తన శక్తి సామర్థ్యాలు.. తనకున్న సత్తా చాటాలన్నదే లోకేశ్ లక్ష్యమంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే లోకశ్ పాదయాత్ర.. ఆయన ఫ్యూచర్ కోసం ఆయన చేసుకుంటున్నదిగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఆయన పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఏ తరహా పరిణామాలకు తెర తీస్తుందో చూడాలి.

Satya

Recent Posts

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

39 minutes ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

2 hours ago

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…

3 hours ago

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

4 hours ago

అనంత శ్రీరామ్… ఇదేం లాజిక్?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…

5 hours ago

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

6 hours ago