Political News

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలా చేయ‌కూడ‌ద‌ట‌!

త‌మ్ముడు త‌న‌వాడైతే.. అన్న‌ట్టుగా ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం అంటున్నారు ప్ర‌జాస్వా మ్య వాదులు. ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకునే అధికారం స్వ‌యంప్ర‌తిప‌త్తి(అటాన‌మ‌స్‌) ఉన్న ఎన్నిక‌ల సంఘానిదే. అయినంత మాత్రాన‌.. ప్ర‌జ‌ల‌కు అస‌లు స‌మాచారం అందించ‌కూడ‌దు.. ఏమీ చెప్ప‌కూడ‌దు అనే విశేష అధికారాల‌ను వినియోగించ‌డం.. టీఎన్ శేష‌న్ వంటి నిఖార్స‌యిన అధికారి ఉన్న‌ప్పుడు కూడా చేయ‌లేదు.

కానీ, ఇప్పుడు మాత్రం త‌న‌కు ఉన్న విశేషాధికారాల పేరిట కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అది కూడా బీజేపీ పాలిత ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇదే నిర్ణయం.. ఇదేం ఆదేశం.. చోద్యం కాక‌పోతే.. అని ప్ర‌జాస్వామ్య వాదులు బుగ్గ‌లు నొక్క‌కుంటున్నారు. మ‌రి ఈసీ ఏం చేసిందంటే..

ఈసీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రసారం, ప్రచురణను నిరోధించేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిమాచల్‌లో నవంబర్ 12వ తేదీన, ప్రధాని నరేంద్ర మోడీ స్వస్థలమైన గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు.. అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో తెర‌వెనుక ఏమైనా జ‌రిగిందా? అనే సందేహాలను ప్ర‌జాస్వామ్య వాదులు వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 11, 2022 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

35 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago