Political News

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలా చేయ‌కూడ‌ద‌ట‌!

త‌మ్ముడు త‌న‌వాడైతే.. అన్న‌ట్టుగా ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం అంటున్నారు ప్ర‌జాస్వా మ్య వాదులు. ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకునే అధికారం స్వ‌యంప్ర‌తిప‌త్తి(అటాన‌మ‌స్‌) ఉన్న ఎన్నిక‌ల సంఘానిదే. అయినంత మాత్రాన‌.. ప్ర‌జ‌ల‌కు అస‌లు స‌మాచారం అందించ‌కూడ‌దు.. ఏమీ చెప్ప‌కూడ‌దు అనే విశేష అధికారాల‌ను వినియోగించ‌డం.. టీఎన్ శేష‌న్ వంటి నిఖార్స‌యిన అధికారి ఉన్న‌ప్పుడు కూడా చేయ‌లేదు.

కానీ, ఇప్పుడు మాత్రం త‌న‌కు ఉన్న విశేషాధికారాల పేరిట కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అది కూడా బీజేపీ పాలిత ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇదే నిర్ణయం.. ఇదేం ఆదేశం.. చోద్యం కాక‌పోతే.. అని ప్ర‌జాస్వామ్య వాదులు బుగ్గ‌లు నొక్క‌కుంటున్నారు. మ‌రి ఈసీ ఏం చేసిందంటే..

ఈసీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రసారం, ప్రచురణను నిరోధించేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిమాచల్‌లో నవంబర్ 12వ తేదీన, ప్రధాని నరేంద్ర మోడీ స్వస్థలమైన గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రచురించడాన్ని నిషేధిస్తూ పోల్ ప్యానెల్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126Aలోని సబ్-సెక్షన్ (ఎల్) కింద ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ భారత ఎన్నికల సంఘం నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5.30 గంటల మధ్య వ్యవధిలో ఏదైనా ఎగ్జిట్ పోల్ నిర్వహించడం, ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించడం లేదా ప్రసారం చేయడం, ఏదైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించారు.. అని ఈసీ నోటిఫికేషన్ లో పేర్కొంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో తెర‌వెనుక ఏమైనా జ‌రిగిందా? అనే సందేహాలను ప్ర‌జాస్వామ్య వాదులు వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 11, 2022 10:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago