తెలుగు టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం నడుస్తుందని చెప్పాలి. ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు రాహుల్ కు అప్పజెప్పటం.. అయ్యాగారు గౌతమ బుద్ధుడి మాదిరి.. పదవుల మీద తనకు పెద్ద ఆసక్తి లేదని చెప్పేయటం.. సోనియమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవటం.. అధినాయకుడు లేక పార్టీ కిందా మీదా పడటం గడిచిన కొన్నాళ్లుగా చూస్తున్నదే. అలా అని పార్టీ పగ్గాలు మరెవరి చేతుల్లో పెట్టేందుకు గాంధీ ఫ్యామిలీకి ఇష్టం లేని పరిస్థితి.
ప్రియాంకను సీన్లోకి తీసుకొస్తే.. ఏదేదో జరిగిపోతుందన్న ప్రచారానికి.. వాస్తవానికి మధ్య వ్యత్యాసం అర్థం కావటమే కాదు.. ప్రియాంక ప్రభావం పెద్దగా ఉండదన్న విషయం మీదా పార్టీ అధినాయకత్వానికి అవగాహన వచ్చినట్లేనని చెబుతున్నారు. ఇలాంటివేళ.. పగ్గాలు అప్పగించే వారి కోసం సోనియమ్మ ఎదురుచూసే పరిస్థితి. ఇదిలా ఉంటే.. పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చునేందుకు రాహుల్ సిద్ధంగా లేకపోవటంతో భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఎవరికి ఎలాంటి స్పష్టత లేని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. తాజాగా దేశ రాజకీయ పరిణామాల్ని మాట్లాడేందుకు పార్టీ ఎంపీలతో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు.. అసోం.. బీహార్.. ఒడిశా.. కేరళకు చెందిన నేతలు రాహుల్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సోనియమ్మను కోరారు. అయితే.. ఈ డిమాండ్ల విషయంపై సమావేశంలో పాల్గొన్న అమ్మాకొడుకులు ఇద్దరు మౌనంగా ఉండటం.. స్పందించకపోవటం గమనార్హం.
ఇదే డిమాండ్ ను గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మధ్యప్రదేశ్ కు చెందిన దిగ్విజయ్ సింగ్ సైతం రాహుల్ కు పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవిని త్యజించిన తర్వాత ఆయనకు పార్టీ పగ్గాలు అందించేందుకు ప్రయత్నాలు జరిగినా.. రాహుల్ మాత్రం సానుకూలంగా స్పందించని పరిస్థితి నెలకొంది. చూస్తుంటే.. అంతులేని కథలా మారిన ఈ వ్యవహారానికి ముగింపు ఎప్పుడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on July 12, 2020 10:59 am
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…