Political News

జనసేన మీటింగ్‌కు స్థలం ఇచ్చారని..

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అవతలి పార్టీ వాళ్లను అధికార పార్టీ, ప్రభుత్వం టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వం మారినపుడు కొన్ని రోజులు ఇలాంటి వాటి మీద దృష్టిపెట్టి.. ఆ తర్వాత పరిపాలన మీద దృష్టిసారిస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీలను, తమకు కంటగింపుగా మారిన వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని.. అలాగే ప్రతిపక్షాలకు సహకరించిన వారిని టార్గెట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, వారికి నష్టం చేకూర్చడం చేస్తోంది జగన్ సర్కారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలను కూడా వదలట్లేదు.

కొన్ని నెలల కిందట జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం కోసం అనుమతులు అడిగితే జగన్ సర్కారు ఆ పార్టీ నేతల్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం కేటాయించడానికి ససేమిరా అంది. చివరికి ఈ మీటింగ్ కోసం మంగళగిరి ప్రాంత రైతులు ముందుకు వచ్చారు. తమ స్థలాన్ని జనసేన మీటింగ్ కోసం ఇచ్చారు. ప్రైవేటు స్థలంలో ప్లీనరీ మీటింగ్ జరుపుకున్నప్పటికీ రకరకాలుగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి పోలీసులు ప్రయత్నించడం తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు తమ అభీష్టానికి వ్యతిరేకంగా జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన రైతులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.

మంళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వాళ్ల ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తుండడం గమనార్హం. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్య జనం మీద కూడా ఈ స్థాయిలో కక్ష సాధింపులకు పాల్పడే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

This post was last modified on November 4, 2022 9:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

వీరమల్లు హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్టు

నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…

38 mins ago

ఆ ఒక్కటి ఇచ్చేయండి ప్లీజ్

అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది.  చాలా…

1 hour ago

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

2 hours ago

సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!

కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…

3 hours ago

తారక్ హృతిక్ జోడి కోసం క్రేజీ కొరియోగ్రాఫర్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…

4 hours ago

పుష్ప 2 ఖాతాలో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…

5 hours ago